* కొత్త తేదీలు త్వరలోనే వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ‘గ్రూప్-2’ రాతపరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. వచ్చే నెల 6, 7 తేదీల్లో జరగాల్సిన ఈ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు టీఎస్పీఎస్సీ కార్యదర్శి అనితారామచంద్రన్ ఒక ప్రకటనలో తెలిపారు. కొత్త తేదీలను తరువాత వెల్లడిస్తామని పేర్కొన్నారు. గ్రూప్-2లో 783 పోస్టులతో టీఎస్పీఎస్సీ గత ఏడాది ఉద్యోగ ప్రకటన జారీచేసిన సంగతి తెలిసిందే. 2023 జనవరి 18 నుంచి ఫిబ్రవరి 16 వరకు దరఖాస్తులు స్వీకరించగా.. 5.51 లక్షల మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. తొలుత ఆగస్టు 29, 30 తేదీల్లో గ్రూప్-2 పరీక్ష నిర్వహించేందుకు కమిషన్ షెడ్యూల్ జారీ చేసింది. కానీ నిరుద్యోగులైన అభ్యర్థుల నుంచి వచ్చిన డిమాండ్ మేరకు దాన్ని నవంబరు 2, 3 తేదీలకు మార్చారు. నవంబరు 3 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కావడంతో కమిషన్ ఈ పరీక్షలను మళ్లీ 2024 జనవరి 6, 7 తేదీలకు రీషెడ్యూల్ చేసింది. డిసెంబరు 27న టీఎస్పీఎస్సీపై సీఎం రేవంత్రెడ్డి సమీక్షించిన అనంతరం తాజా నిర్ణయం వెలువడింది.
టీఎస్పీఎస్సీ గ్రూప్ - II - స్టడీ మెటీరియల్
పేపర్ - I
జనరల్ స్టడీస్ అండ్ జనరల్ ఎబిలిటీస్
పేపర్ - II
సెక్షన్ - 1 - భారతదేశం, తెలంగాణ సామాజిక, సాంస్కృతిక చరిత్ర
సెక్షన్ - 2 - భారత రాజ్యాంగం, రాజకీయాలు
సెక్షన్ - 3 - సమాజ నిర్మాణం, సమస్యలు, ప్రజా విధానాలు/ పథకాలు
పేపర్ - III
సెక్షన్ - 1 - భారత ఆర్థిక వ్యవస్థ - సమస్యలు, సవాళ్లు
సెక్షన్ - 2 - తెలంగాణ ఆర్థికవ్యవస్థ, అభివృద్ధి
సెక్షన్ - 3 - అభివృద్ధి సమస్యలు, మార్పు
పేపర్ - IV
సెక్షన్ - 1 - ది ఐడియా ఆఫ్ తెలంగాణ (1948 - 70)
సెక్షన్ - 2 - సమీకరణ దశ (1971 - 90)
సెక్షన్ - 3 - తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం (1991 - 2014)
మరింత సమాచారం... మీ కోసం!
‣ త్రివిధ దళాల్లో ఉన్నత ఉద్యోగాలు
‣ ప్రాథమ్యాల ఎంపికతో ప్రయోజనం!
‣ డిగ్రీతో 444 కేంద్ర కొలువుల భర్తీ
‣ పరీక్షల్లో మార్కులు సాధించాలంటే?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.