ఈనాడు, అమరావతి: అంగన్వాడీ టీచర్లు, ప్రభుత్వ పాఠశాలల్లో 1, 2 తరగతులు బోధించే ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చేందుకు ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం(అంగ్రూ) కమ్యూనిటీ సైన్సు విభాగం, మహిళ, శిశు సంక్షేమ శాఖ, పాఠశాల విద్యాశాఖ సంయుక్తంగా ఒప్పందం కుదుర్చుకున్నాయి. అంగన్వాడీ టీచర్లకు ‘జ్ఞానజ్యోతి’ 120 రోజుల కోర్సుపై మూడేళ్లల్లో శిక్షణ ఇవ్వనున్నారు. ‘జ్ఞానప్రకాశ్’ 60 రోజుల శిక్షణను 1,2 తరగతులకు బోధించే ఎస్జీటీ టీచర్లకు ఇవ్వనున్నారు. ఇప్పటికే ప్రథమ్ సంస్థ మాస్టర్ ట్రైనర్లకు శిక్షణ ఇచ్చింది. వీరు క్షేత్రస్థాయిలో శిక్షణ అందిస్తారు. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖకు సంబంధించిన సమాచారం కోసం వెబ్సైట్ను సమగ్ర శిక్ష వెబ్సైట్ను మంత్రి బొత్స సత్యనారాయణ ప్రారంభించారు. 6-8 తరగతులు చదువుతున్న విద్యార్థులకు మానసిక, శారీరక వృద్ధితోపాటు ఆలోచన విధానం, సమస్యలు ఎదురైనప్పుడు సమర్థంగా ఎదుర్కొనేందుకు శిక్షణ ఇచ్చేందుకు మ్యాజిక్ బస్ ఇండియా ఫౌండేషన్తో పాఠశాల విద్యాశాఖ మరో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన సీడీని మంత్రి విడుదల చేశారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఫర్నిచర్ డిజైన్ కెరియర్ గైడెన్స్
‣ బాడీ లాంగ్వేజ్ ఎందుకు ముఖ్యం?
‣ ఇగ్నోలో నాన్ టీచింగ్ కొలువులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.