* ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం
* పాత డైరెక్టర్లను నియమించడంలో నిబంధనలకు నీళ్లొదిలారని స్పష్టీకరణ
ఈనాడు, హైదరాబాద్: తెలంగాణలోని విద్యుత్తు పంపిణీ సంస్థ, ఉత్పత్తి సంస్థల్లో కొత్త డైరెక్టర్ల నియామకాన్ని ప్రభుత్వం చేపట్టనుంది. నిబంధనలకు లోబడి నోటిఫికేషన్ జారీచేసి, డైరెక్టర్ల నియామక ప్రక్రియ మొదలుపెట్టాలని ట్రాన్స్కో, జెన్కో సంస్థల సీఎండీలను ఆదేశించింది. ఈ మేరకు ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఈ రెండు సంస్థల్లో 11 మంది డైరెక్టర్లు నిబంధనలకు విరుద్ధంగా ఆయా పదవుల్లో కొనసాగుతున్నారని ఉత్తర్వుల్లో ప్రభుత్వం తెలిపింది. వీరిని రెండేళ్ల కాలపరిమితితో నియమిస్తారు. తరువాత అత్యవసరమైతే వారి సేవల్ని ఏడాది చొప్పున గరిష్ఠంగా రెండేళ్లు పొడిగించే విషయాన్ని పరిశీలిస్తారు. అంటే డైరెక్టర్గా ఆ పోస్టులో నాలుగేళ్లకు మించి ఉండటానికి వీల్లేదు. కానీ గత ప్రభుత్వం కొందరు డైరెక్టర్లను నియమించి, వారి పదవీ కాలాన్ని తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు అంటూ పొడిగిస్తూ వచ్చింది. ఇలా ట్రాన్స్కోలో ఐదుగురు, జెన్కోలో ఆరుగురు డైరెక్టర్లుగా కొనసాగుతున్నారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం బోర్డులను ప్రక్షాళన చేయాలని నిర్ణయించింది. కొత్తవారి నియామకాల్లో ప్రభుత్వ నిబంధనలు పాటించాలని, కాలపరిమితితో చేపట్టాలని స్పష్టం చేసింది. దీంతో ట్రాన్స్కో, జెన్కో సంస్థల్లో కొత్త డైరెక్టర్ల నియామకం కోసం నోటిఫికేషన్లు జారీకానున్నాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.