* ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య లింబాద్రి
జూబ్లీహిల్స్, న్యూస్టుడే: దేశంలో ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్య గణనీయంగా పెరిగిందని తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య ఆర్. లింబాద్రి అన్నారు. డా.బి.ఆర్.అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం సామాజికశాస్త్ర విభాగం, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి, ఐసీఎస్ఎస్ఆర్ - దక్షిణ భారతదేశ ప్రాంతీయ కేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో భారతదేశంలో ఉన్నత విద్య: సమస్యలు, నాణ్యత, సవాళ్లు అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు ఆదివారం ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆచార్య లింబాద్రి మాట్లాడుతూ.. నైపుణ్యంతో కూడిన, ఉపాధి అందించే కోర్సులను ప్రవేశపెట్టాలని.. తద్వారా ఉన్నత విద్యను అభ్యసించే వారి సంఖ్య పెంచడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు. అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి, న్యాక్ మాజీ డైరెక్టర్ ప్రొ.వీఎస్ ప్రసాద్ మాట్లడుతూ విద్యార్థులకు ఉన్నత విద్యలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, ప్రత్యేకించి ఓపెన్ టెక్నాలజీస్’, ‘ఓపెన్ ఆటిఫిషియల్ ఇంటెలిజెన్స్’ అనేవి ఉచితంగా అందుబాటులో ఉండాలన్నారు. విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య కె.సీతారామరావు, అకడమిక్ డైరెక్టర్ ప్రొ.ఘంటా చక్రపాణి, రిజిస్ట్రార్ ప్రొ.ఎ.వి.ఆర్.ఎన్.రెడ్డి, సామాజికశాస్త్రం విభాగ డీన్ ప్రొ.వి. శ్రీనివాస్, సెమినార్ డైరెక్టర్ డా.బి.శ్రీనివాస్, సెమినార్ కో-డైరెక్టర్ డా.పి.వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ఆచార్య. సి. గణేష్, కృష్ణా విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ఆచార్య వి.వెంకయ్య, మహారాష్ట్ర ఓపెన్ యూనివర్సిటీ మాజీ ఉప కులపతి యశ్వంతరావు చవాన్, మౌలానా ఆజాద్ జాతీయ ఉర్దూ విశ్వవిద్యాలయ ప్రొ. ఇ. వాయునందన్, దూరవిద్య డైరెక్టర్ ప్రొ.ముష్తాక్ అహ్మద్ ఐ.పటేల్ పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.