* నేటితో ముగియనున్న పరీక్షలు
* 12న ఫలితాల వెల్లడి
ఈనాడు, హైదరాబాద్: జేఈఈ మెయిన్లో ఇప్పటివరకు జరిగిన పేపర్-1 పరీక్షల్లో జనవరి 31న జరిగిన మొదటి విడత గణితం కఠినంగా ఉంది. సాధారణ విద్యార్థులు 25 ప్రశ్నల్లో ఏడెనిమిది చేయడం కూడా కష్టమేనని జేఈఈ నిపుణులు చెబుతున్నారు. రసాయనశాస్త్రం ప్రశ్నలు మధ్యాహ్నం విడతలో చాలా కష్టంగా ఉన్నాయని, ఆ ప్రశ్నలకు కనీసం 50 నిమిషాల సమయం పడుతుందని జేఈఈ నిపుణుడు ఎం.ఉమాశంకర్ తెలిపారు. భౌతికశాస్త్రం ప్రశ్నలు చాలా సులభంగా ఉన్నాయని, వాటిని త్వరగా చేసి మిగిలిన సమయాన్ని గణితం, రసాయనశాస్త్రం ప్రశ్నలకు వెచ్చించిన వారు ర్యాంకుల్లో ముందుంటారని తెలిపారు. జనవరి 27 నుంచి జరుగుతున్న జేఈఈ మెయిన్ పేపర్-1 పరీక్షలు గురువారంతో ముగియనున్నాయి.
త్వరలో ప్రాథమిక కీ
మూడు నాలుగు రోజుల్లో జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) ప్రాథమిక కీ విడుదల చేసే అవకాశముంది. ఫిబ్రవరి 12వ తేదీన ఫలితాలు(పర్సంటైల్ స్కోర్) వెల్లడిస్తారు. మళ్లీ ఏప్రిల్ 1-15వ తేదీల మధ్య చివరి విడత పరీక్షలు జరిగిన అనంతరం రెండింటిలో వచ్చిన ఉత్తమ స్కోర్ను పరిగణలోకి తీసుకొని ర్యాంకులు విడుదల చేస్తారు. ఏప్రిల్ పరీక్షలకు హాజరుకావాలనుకునే వారు ఫిబ్రవరి రెండో తేదీ నుంచి దరఖాస్తు చేసుకోవచ్చు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఐటీ రంగంలో అవరోధాలు అధిగమిద్దాం!
‣ ఎంఫిల్.. పీహెచ్డీ- ఏమిటి తేడా?
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.