ఈనాడు, అమరావతి: సాధారణ ఎన్నికలకు ముందు మూడు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇంజినీరింగ్, డిగ్రీ కళాశాలలున్న మూడు యాజమాన్యాలు బ్రౌన్ఫీల్డ్ ప్రైవేటు విశ్వవిద్యాలయం ఏర్పాటుకు చేసిన దరఖాస్తులకు సీఎం జగన్ ఆమోదించారు. మూడు యాజమాన్యాల్లో ఇద్దరు యజమానులు వైకాపాకు చెందినవారే కావడం విశేషం. కాకినాడ జిల్లా సూరంపాలెంలోని శేషారెడ్డికి చెందిన ఆదిత్య విద్యాసంస్థలు, అన్నమయ్య జిల్లాలోని గంగిరెడ్డికి చెందిన అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల, రాజమహేంద్రవరంలోని కేవీవీ సత్యనారాయణరాజు (చైతన్యరాజు)కు చెందిన గోదావరి ఇంజినీరింగ్ కళాశాలలను బ్రౌన్ఫీల్డ్ ప్రైవేటు విశ్వవిద్యాలయాలుగా మార్చుకునేందుకు ప్రభుత్వం ఆమోదించింది. ఇప్పటివరకున్న నిబంధనల ప్రకారం ప్రస్తుతమున్న కళాశాలల్లో 70 శాతం సీట్లతోపాటు కొత్తగా ఏర్పడిన విశ్వవిద్యాలయంలో తీసుకొచ్చే కోర్సుల్లో 35 శాతం సీట్లను కన్వీనర్ కోటాకు కేటాయించాల్సి ఉంటుంది. ఫిబ్రవరి 5వ తేదీ నుంచి నిర్వహించనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ మూడు ప్రైవేటు విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సంబంధించిన బిల్లులను ప్రవేశపెట్టనున్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ప్రతిష్ఠాత్మక సంస్థల్లో ‘ఫిజిక్స్’ కోర్సులు
‣ ఎన్సీఎల్లో ట్రైనీ సూపర్వైజరీ పోస్టులు
‣ ‘నిక్మార్’ నిర్మాణ రంగ కోర్సులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.