• facebook
  • whatsapp
  • telegram

Exams: ‘పది’ పరీక్షలకు పక్కా ఏర్పాట్లు

* పకడ్బందీగా నిర్వహించాలి

ఎన్టీఆర్‌ కలెక్టరేట్, న్యూస్‌టుడే : పదో తరగతి పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను కలెక్టర్‌ ఎస్‌.డిల్లీరావు ఆదేశించారు. మార్చి 18వ తేదీ నుంచి 30 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు తెలిపారు. నగరంలోని విడిది కార్యాలయంలో వివిధ శాఖల అధికారులతో ఫిబ్రవరి 12న సమీక్షించారు. ఆయన మాట్లాడుతూ.. మొత్తం 33,007 మంది విద్యార్థులు హాజరు కానుండగా, వీరిలో 17,414 మంది బాలురు, 15,593 మంది బాలికలు ఉన్నట్టు చెప్పారు. రెగ్యులర్‌ విద్యార్థులు 28,190, ప్రైవేటు విద్యార్థులు 4,817 మంది ఉన్నారని వివరించారు. 178 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు. 178 మంది చీఫ్‌ సూపరిండెంటెంట్లు, డిపార్టుమెంటు అధికారులు, 1,475 మంది ఇన్విజిలేటర్లను నియమించినట్టు పేర్కొన్నారు. విద్యార్థులను ఉదయం 8.45 గంటలకు కేంద్రాల్లోకి అనుమతి ఇవ్వనున్నట్టు వివరించారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని, పొరపాట్లు జరగకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఆయా కేంద్రాలను ముందుగానే తనిఖీ చేయాలని, ఏమైనా లోటుపాట్లు ఉంటే సరిచేసుకుని, సిద్ధంగా ఉండాలన్నారు. విద్యుత్తు, తాగునీరు, వైద్య సేవలు అందుబాటులో ఉంచాలని పేర్కొన్నారు. ఆయా మార్గాల్లో ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. 

 

ఆంధ్రప్రదేశ్ పదో తరగతి స్టడీ మెటీరియల్

తెలుగు TM EM
హిందీ TM EM
ఇంగ్లిష్ TM EM
గణిత శాస్త్రం TM EM
జీవశాస్త్రం TM EM
సాంఘిక శాస్త్రం TM EM
భౌతిక రసాయన శాస్త్రం TM EM
     
‣ మోడ‌ల్‌ పేప‌ర్లు TM EM
‣ ప్రీవియ‌స్ పేప‌ర్లు    TM EM

టెన్త్ క్లాస్‌ మోడ‌ల్ పేపర్లు - 2023 (e-Books)


 

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

‣ కొత్తకళ వసతులు.. కో-లివింగ్‌ ఆవాసాలు!

‣ సందేహించొద్దు.. సాధిద్దాం!

‣ ఆఫర్‌ లెటర్‌ అందుకుంటే సరిపోదు!

‣ ఐటీ కొలువుకు దగ్గరి దారి

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 13-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.