• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 13-02-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)  

1.  యూఏఈతో ద్వైపాక్షిక పెట్టుబడుల ఒప్పందం

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)లో  పర్యటన నిమిత్తం ప్రధాని మోదీ రాజధాని నగరమైన అబుధాబీకి చేరుకున్నారు. విమానాశ్రయంలో దేశాధ్యక్షుడు షేక్‌ మహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌ స్వయంగా మోదీకి స్వాగతం పలికి ఆలింగనం చేసుకున్నారు.

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

2.   భారత రెజ్లింగ్‌పై  నిషేధం ఎత్తివేత    

భారత రెజ్లింగ్‌ సమాఖ్య (డబ్ల్యూఎఫ్‌)పై ఆరు నెలల కిందట విధించిన నిషేధాన్ని యునైటెడ్‌ వరల్డ్‌ రెజ్లింగ్‌ (యుడబ్ల్యూడబ్ల్యూ) ఎత్తి వేసింది. గడువు లోపు ఎన్నికలు నిర్వహించనందుకు గత ఏడాది డబ్ల్యూఎఫ్‌ఐపై యుడబ్ల్యూడబ్ల్యూ నిషేధం విధించిన సంగతి తెలిసిందే. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




3.  మాజీ టెస్టు క్రికెటర్‌ దత్తాజిరావ్‌ మరణం        

భారత మాజీ టెస్టు క్రికెటర్‌ దత్తాజిరావ్‌ గైక్వాడ్‌ మృతి చెందారు. ఆయన వయసు 95 ఏళ్లు. టెస్టు క్రికెట్‌ ఆడి.. జీవించి ఉన్నవాళ్లలో పెద్ద వయస్కుడైన దత్తాజి  బరోడా ఆసుపత్రిలో వయసు సంబంధిత సమస్యలతో మరణించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




4.  శాశ్వత న్యాయమూర్తులుగా ముగ్గురి నియామకానికి సుప్రీం కొలీజియం సిఫార్సు

ముగ్గురు అదనపు న్యాయమూర్తులను శాశ్వత న్యాయమూర్తులుగా నియమించాలని సుప్రీంకోర్టు కొలీజియం కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేసింది. ఇందులో ప్రస్తుతం ఏపీ హైకోర్టులో సేవలందిస్తున్న జస్టిస్‌ బొప్పన వరాహ లక్ష్మీనరసింహ చక్రవర్తి, జస్టిస్‌ తల్లాప్రగడ మల్లికార్జునరావు, మధ్యప్రదేశ్‌ హైకోర్టులో పనిచేస్తున్న జస్టిస్‌ దుప్పల వెంకటరమణ ఉన్నారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




5.  ఉక్రెయిన్‌పై తొలిసారి జిర్కాన్‌ క్షిపణిని ప్రయోగించిన రష్యా

రష్యా తన అమ్ములపొదిలోని అత్యాధునిక అస్త్రాన్ని ఉక్రెయిన్‌పై ప్రయోగించింది. ఈ విషయాన్ని మాస్కో బహిర్గతం చేయకపోయినా కీవ్‌ ఫోరెన్సిక్‌ పరిశోధనా సంస్థ బృందం గుర్తించింది. కీవ్‌పై జరిగిన ఒక దాడిలో జిర్కాన్‌ హైపర్‌సోనిక్‌ క్రూజ్‌ క్షిపణిని వాడినట్లు ఆ బృందం వెల్లడించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...




6.  ప్రమాదకర దశాబ్దంలోకి ప్రపంచం ఐఐఎస్‌ఎస్‌ నివేదిక 

ఉక్రెయిన్‌పై రష్యా దండెత్తడం, ఇజ్రాయెల్‌పై హమాస్‌ దాడి, దక్షిణ చైనా సముద్రంపై చైనా పట్టుబిగిస్తుండడం వంటి పరిణామాల నేపథ్యంలో ప్రపంచం ఇప్పుడు ‘ప్రమాదకర దశాబ్దం’లో అడుగుపెట్టిందని ‘అంతర్జాతీయ వ్యూహాత్మక అధ్యయనాల సంస్థ’ (ఐఐఎస్‌ఎస్‌) తాజా నివేదికలో పేర్కొంది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 


మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.