• facebook
  • whatsapp
  • telegram

CBSE Exams: ఫిబ్రవరి15 నుంచి సీబీఎస్‌ఈ పరీక్షలు

హాజరుకానున్న 39 లక్షల మంది


దిల్లీ: సీబీఎస్‌ఈ 10, 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 15 నుంచి ప్రారంభం కానున్నాయి. మన దేశంతోపాటు 27 దేశాల్లో ఈ పరీక్షలకు 39 లక్షల మందికిపైగా విద్యార్థులు హాజరుకానున్నారు. దిల్లీలో 877 కేంద్రాల్లో 5.8లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఉదయం 10.30కు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. రైతుల దిల్లీ చలో ఆందోళన నేపథ్యంలో దేశ రాజధానిలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉన్నందున విద్యార్థులు ఇంటి నుంచి త్వరగా బయలుదేరి పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని సీబీఎస్‌ఈ ఫిబ్రవరి 14న సూచించింది. దేశంలోని మిగిలిన ప్రాంతాల్లోని, ఇతర దేశాల్లోని విద్యార్థులూ 10 గంటలలోపే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని పేర్కొంది. స్థానిక పరిస్థితులు, ట్రాఫిక్‌, వాతావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ముందుగా రావాలని సూచించింది. విద్యార్థులు, తల్లిదండ్రులకు ఈ విషయంలో అన్ని పాఠశాలలు సాయం చేయాలని పేర్కొంది.

మరింత సమాచారం... మీ కోసం!

‣ కోస్టుగార్డులో 260 నావిక్‌ ఉద్యోగాలు

‣ ఐడీబీఐలో కోర్సు.. కొలువుకు అవకాశం

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 15-02-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.