• facebook
  • whatsapp
  • telegram

Inter: ఇక నుంచి అయిదు నిమిషాలు ఆలస్యమైనా అనుమతి: ఇంటర్‌ బోర్డు

ఈనాడు, హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షలు రాసే విద్యార్థులు ఇక నుంచి పరీక్షా కేంద్రానికి అయిదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా అనుమతించాలని ఇంటర్‌ బోర్డు జిల్లా అధికారులు, చీఫ్‌ సూపరింటెండెంట్‌లను ఆదేశించింది. ఇంతవరకు విద్యార్థులు నిమిషం ఆలస్యంగా హాజరైనా పరీక్షలకు అనుమతించకపోవడంతో ఆదిలాబాద్‌ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీనిపై పలు విమర్శలు వెల్లువెత్తడంతో అయిదు నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చే వారిని అనుమతించాలని ఇంటర్‌ విద్యాబోర్డు నిర్ణయించినట్లు తెలుస్తోంది.  


మార్చి 4వ తేదీ నుంచి మూల్యాంకనం

ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం మార్చి నాలుగో తేదీ నుంచి ప్రారంభమవుతుందని మార్చి 1న ఇంటర్‌ విద్యాబోర్డు తెలిపింది. మార్చి 24 వరకు దానిని నిర్వహిస్తామని వెల్లడించింది.

ఇంటర్మీడియట్, పదో తరగతి మోడల్ పేపర్లు - 2024


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 02-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.