ఎ.ఎన్.యు, న్యూస్టుడే: రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే లాసెట్ నోటిఫికేషన్ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వీసీ రాజశేఖర్ మార్చి 21న విడుదల చేశారు. వర్సిటీలో జరిగిన కార్యక్రమంలో లాసెట్ కన్వీనర్ ఆచార్య సత్యనారాయణ మాట్లాడుతూ 3, 5 ఏళ్ల ఎల్ఎల్బీ కోర్సులు, 2 ఏళ్ల పీజీ కోర్సులకు సంబంధించిన నోటిఫికేషన్ను విడుదల చేశామన్నారు. మార్చి 26 నుంచి ఏప్రిల్ 25వ తేదీ లోపు ఎలాంటి అపరాధ రుసుం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. రూ.500 అపరాధ రుసుంతో ఏప్రిల్ 26 నుంచి మే 3వ తేదీ వరకు, రూ.1000 అపరాధ రుసుంతో మే 4 నుంచి 11వ తేదీ వరకు, రూ. 2 వేల అపరాధ రుసుంతో మే 12 నుంచి 20వ తేదీ వరకు, రూ.3 వేల అపరాధ రుసుంతో మే 21 నుంచి 29వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 30 నుంచి జూన్ 1వ తేదీ వరకు దరఖాస్తుల్లో మార్పులు చేసుకోవచ్చన్నారు. జూన్ 3 నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చని కన్వీనర్ వివరించారు. జూన్ 9వ తేదీ మధ్యాహ్నం 2.30 నుంచి 4 గంటల వరకు ఆన్లైన్లో పరీక్ష నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలను ఏఎన్యూ వెబ్సైట్లో ఉంచామన్నారు. కార్యక్రమంలో రిజిస్ట్రార్ కరుణ, ఆచార్య సంధ్యాకోల్, డాక్టర్ నాగరాజు, డాక్టర్ బాలమురళీ కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ జీవ శాస్త్రాల్లో కొలువుకు విస్తృత అవకాశాలు
‣ మార్కులకు పరిష్కారం.. పునశ్చరణే!
‣ ఐటీ, కార్పొరేట్ రంగాల్లో రాణిద్దాం ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.