* 25న మాక్ పాలిసెట్- 2024
గుంటూరు విద్య, న్యూస్టుడే: అమరావతిరోడ్డులోని హిందూ ఇంజినీరింగ్ కళాశాలలో ఏప్రిల్ 25న మాక్ పాలిసెట్- 2024 నిర్వహిస్తున్నట్లు కళాశాల కార్యదర్శి చెరువు రామకృష్ణమూర్తి తెలిపారు. ఏప్రిల్ 18న దీనికి సంబంధించిన పోస్టర్ను కళాశాలలో ఆవిష్కరించారు. పాలిసెట్- 2024కు దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు ఎవరైనా దీనికి హాజరు కావొచ్చన్నారు. ఏప్రిల్ 25న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్ష జరుగుతుందన్నారు. రాయాలనుకునే వారు 83329 11155, 93907 875754 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు. పాలిసెట్- 2024 ప్రవేశపరీక్ష ఏప్రిల్ 27 న జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు అధికారిక వెబ్సైట్లో నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. పోస్టర్ ఆవిష్కరణలో ప్రిన్సిపల్ డాక్టర్ చిన్నం సుబ్బారావు, వైస్ప్రిన్సిపల్ వజ్రాల నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరింత సమాచారం... మీ కోసం!
‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!
‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..
‣ ఎన్ఐఎన్ కోర్సులతో మెరుగైన అవకాశాలు
‣ కొలువుకు ఎంపికైతే.. నెలకు రూ.లక్ష జీతం!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.