• facebook
  • whatsapp
  • telegram

Polyset: 27న పాలీసెట్‌-2024 

* పరీక్ష రాయనున్న విద్యార్థులు 7,864 మంది 

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: ఎన్టీఆర్‌ జిల్లాలో ఏప్రిల్‌ 27న  ‘పాలీసెట్‌-2024’ నిర్వహణకు ఏర్పాట్లు చేశారు. జిల్లాలో రెండు ప్రభుత్వ, 13 ప్రైవేటు పాలిటెక్నిక్‌ కళాశాలల్లో వివిధ ట్రేడుల్లో 3,920 సీట్లున్నాయి. జిల్లా వ్యాప్తంగా మొత్తం 20 కేంద్రాల్లో ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు చేశామని విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎం.విజయసారథి తెలిపారు. విజయవాడలో 11 కేంద్రాల్లో 4,888 మంది, తిరువూరు 4 కేంద్రాల్లో 1,416, నందిగామ 5 కేంద్రాల్లో 1,560 మంది కలిపి మొత్తం 7,864 మంది పరీక్ష రాయనున్నారు. అభ్యర్థులను ఉదయం 10గంటలకు కేంద్రాల లోపలకు అనుమతిస్తారు. ప్రవేశ పరీక్ష ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతుందని, నిమిషం ఆలస్యంగా వచ్చినా అనుమతీయబోమని పేర్కొన్నారు. ఇప్పటికే పరిశీలకులను నియమించామని తెలిపారు. 



మరింత సమాచారం... మీ కోసం!

‣ కోచింగ్‌ లేదు... డెయిలీ టార్గెట్స్‌ పూర్తీచేశా!

‣ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్లకు ఆర్మీ ఆహ్వానం!

‣ బొగ్గు గనుల్లో కొలువులు

‣ ఆధునిక అవకాశాలకు న్యాయ విద్య!

‣ రాబోయే రోజుల్లో ఉద్యోగార్థుల సన్నద్ధత ఇలా..

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 26-04-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.