* 10 నుంచి జోసా కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభం
ఈనాడు ప్రతిభ డెస్క్: ఐఐటీల్లో బీటెక్ సీట్ల భర్తీకి మే 26న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాలు విడుదయ్యాయి. దేశవ్యాప్తంగా సుమారు 2 లక్షల మంది హాజరయ్యారు. వారిలో తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 40వేల మంది ఉన్నారని అంచనా. పరీక్ష నిర్వహణ బాధ్యతలు తీసుకున్న ఐఐటీ మద్రాస్ ఈ ఫలితాలను విడుదల చేసింది. ఐఐటీలు, ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీలతో పాటు పలు కేంద్ర ప్రభుత్వ విద్యాసంస్థల్లో బీటెక్, బ్యాచులర్ ఆఫ్ సైన్స్ (బీఎస్), అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సుల్లో సీట్ల భర్తీకి జోసా పేరిట సంయుక్త కౌన్సెలింగ్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ప్రక్రియ జూన్ 10 నుంచి జులై 23వ తేదీ వరకు 44 రోజులపాటు కొనసాగుతుంది.
జేఈఈ అడ్వాన్స్డ్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.