* డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడి
హైదరాబాద్: తెలంగాణలో త్వరలో జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ మేరకు టీజీపీఎస్సీ ఛైర్మన్ మహేందర్ రెడ్డికి ఫోన్ చేసి ఉద్యోగ ఖాళీల వివరాలపై ఆయన చర్చించారు. డిసెంబర్లో గ్రూప్-2 నిర్వహణపై పరిశీలించాలని పేర్కొన్నారు. ఓవర్ ల్యాపింగ్ లేకుండా పోటీ పరీక్షలు నిర్వహిస్తామని చెప్పారు. త్వరలో ప్రతి అసెంబ్లీ స్థానంలో ఒక అంబేడ్కర్ నాలెడ్జ్ కేంద్రం ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు. సచివాలయంలో గ్రూప్-2 అభ్యర్థులతో భట్టి విక్రమార్క చర్చించారు. గ్రూప్-2 అభ్యర్థులతో చర్చించిన వారిలో ఎంపీ మల్లు రవి, బలరాం నాయక్ తదితరులు ఉన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.