* రెండు రోజుల ఆన్లైన్ శిక్షణ
ఈనాడు ప్రతిభ డెస్క్: హైదరాబాదులోని కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ- ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్.. ఏఐ టూల్స్, చాట్జీపీటీకి సంబంధించిన శిక్షణను ఆన్లైన్లో రెండు రోజులు పాటు నిర్వహిస్తోంది. జూన్ 22-23 తేదీల్లో సాయంత్రం 5.30 గంటల నుంచి 8.30 గంటల వరకు తరగతులు ఉంటాయి. ఏఐ టూల్స్, చాట్జీపీటీకి సంబంధించిన ఉపయోగాలు, సామాజిక మాధ్యమాల్లో చాట్జీపీటీని ఉపయోగించి కంటెంట్ రాయడం, మార్కెటింగ్ ఫ్రేమ్వర్క్లో జీమెయిల్స్ను క్రియేట్ చేయడం తదితర విషయాలు నేర్చుకోవచ్చు. రెండు రోజుల తరగతుల తర్వాత స్టడీ మెటిరీయల్ను సాఫ్ట్ కాపీ రూపంలో అందిస్తారు. ఈ శిక్షణకు మూడు వేల రూపాయల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. శిక్షణ అనంతరం సర్టిఫికేట్ అందజేస్తారు. పూర్తి వివరాలకు 99711875996, 9910948732 నెంబర్లను సంప్రదించవచ్చు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.