* పరీక్షకు 2 గంటల ముందు ప్రశ్నపత్రం సిద్ధం
దిల్లీ: దేశంలో వైద్యవిద్య పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో చేరేందుకు నీట్-పీజీ 2024 (NEET PG 2024) పరీక్ష తేదీ ఖరారైంది. ఆగస్టు 11న పరీక్ష నిర్వహించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) నిర్ణయించింది. రెండు షిఫ్టుల్లో ఉదయం, మధ్యాహ్నం పరీక్ష నిర్వహించబోతున్నట్లు స్పష్టం చేసింది. నీట్ యూజీ-2024 పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంపై దేశవ్యాప్తంగా వివాదం నెలకొన్న వేళ జూన్ 23న జరగాల్సిన నీట్ పీజీ పరీక్షను వాయిదా వేస్తున్నట్లు పరీక్షకు ఒక రోజు ముందు కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా రివైజ్డ్ షెడ్యూల్ను ప్రకటించారు. ఆన్లైన్లో నిర్వహించబోయే నీట్-పీజీకి కేవలం 2 గంటల ముందు ప్రశ్నపత్రాన్ని సిద్ధం చేసి పరీక్ష కేంద్రాలకు పంపించాలని నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ ఓ జాతీయ మీడియా ఇటీవల కథనం వెల్లడించింది.
మరింత సమాచారం... మీ కోసం!
‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!
‣ స్వల్ప వ్యవధిలో స్థిరమైన ఉపాధి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.