• facebook
  • whatsapp
  • telegram

Paper leak: పోటీ పరీక్షల్లో అక్రమాలకు పాల్పడితే.. జైలు శిక్ష, రూ.10 లక్షల ఫైన్‌!

* బిహార్‌ అసెంబ్లీలో కీలక బిల్లు ఆమోదం
 


పట్నా: నీట్‌ వంటి ప్రతిష్ఠాత్మక పరీక్ష ప్రశ్నపత్రం లీకేజీ (NEET Row) వ్యవహారం ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపిన విషయం తెలిసిందే. ఈనేపథ్యంలో ప్రశ్నపత్రం లీకేజీలకు అడ్డుకట్ట వేసేందుకు, ప్రభుత్వ నియామక పోటీ పరీక్షల్లో అవకతవకల్ని నియంత్రించేందుకు బిహార్‌ అసెంబ్లీలో కీలక బిల్లును బుధవారం ఆమోదించారు. బిహార్ పబ్లిక్‌ ఎగ్జామినేషన్స్‌ (ప్రివెన్షన్‌ ఆఫ్‌ అన్‌ఫెయిర్‌ మీన్స్‌) బిల్లు-2024ను రాష్ట్ర అసెంబ్లీ వ్యవహారాల మంత్రి విజయ్ కుమార్ చౌదరి సభలో ప్రవేశపెట్టగా.. ప్రతిపక్షాల వాకౌట్‌ మధ్య మూజువాణి ఓటుతో ఈ బిల్లు ఆమోదం పొందింది.


నీట్‌-యూజీ పరీక్ష ప్రశ్నపత్రం లీక్‌, అక్రమాల ఆరోపణలపై చెలరేగిన వివాదానికి బిహార్‌ కేంద్ర బిందువుగా ఉన్న నేపథ్యంలో పోటీ పరీక్షల్లో అక్రమాలను కట్టడి చేయడమే లక్ష్యంగా ఈ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడం గమనార్హం. ఈ బిల్లు ప్రకారం.. ఆయా పరీక్షల్లో ఎవరైనా అక్రమాలకు పాల్పడితే వారికి మూడేళ్ల నుంచి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, రూ.10లక్షల జరిమానాతో పాటు కఠినంగా శిక్షించనున్నారు.
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Published Date : 24-07-2024 03:51:44 PM

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.