* 18,799 ఖాళీల భర్తీ
* ఆర్ఆర్బీ భోపాల్ ప్రకటన జారీ
ఈనాడు ప్రతిభ డెస్క్: ఉద్యోగార్థులకు రైల్వే శాఖ తీపి కబురు చెప్పింది. వివిధ రైల్వే జోన్లలో అసిస్టెంట్ లోకో పైలట్ కొలువులకు గత జనవరిలో ఆర్ఆర్బీ ప్రకటన జారీ చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్లో 5,696 ఖాళీలు పేర్కొనగా.. దీన్ని భారీగా పెంచుతున్నట్లు ఆర్ఆర్బీ భోపాల్ అధికారిక ప్రకటనను విడుదల చేసింది. దేశ వ్యాప్తంగా వివిధ రైల్వే జోన్లలో అవసరాల దృష్ట్యా మొత్తం 18,799 ఏఎల్పీ పోస్టులు భర్తీ కానున్నాయి. ఈ మేరకు త్వరలో జోన్ల వారీగా ఖాళీల వివరాలు వెల్లడి కానున్నాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు త్వరలో ప్రాధామ్యాల నమోదుకు అవకాశం కల్పించనున్నట్లు ఆర్ఆర్బీ భోపాల్ స్పష్టం చేసింది. అభ్యర్థులు ఈ విషయంలో తదుపరి నోటీసుల కోసం వెబ్సైట్ను పరిశీలిస్తూ ఉండాలని కోరింది. ఫస్ట్ స్టేజ్ సీబీటీ-1, సెకండ్ స్టేజ్ సీబీటీ-2, కంప్యూటర్ బేస్డ్ ఆప్టిట్యూడ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఏఎల్పీ రాత పరీక్ష స్టడీ మెటీరియల్ కోసం క్లిక్ చేయండి
ఆర్ఆర్బీ భోపాల్ అధికారిక ప్రకటన వివరాలు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.