* ఆగస్టు 20 నుంచి దరఖాస్తుల స్వీకరణ
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంజినీరింగ్, ఫార్మసీ, మేనేజ్మెంట్, న్యాయ, ఉపాధ్యాయ విద్య తదితర కోర్సులందించే కళాశాలలకు.. వచ్చే ఏడాది నుంచి కొత్త ఫీజులు నిర్ణయించేందుకు తెలంగాణ ప్రవేశాలు, రుసుముల నియంత్రణ కమిటీ (టీఏఎఫ్ఆర్సీ) సోమవారం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఆగస్టు 20వ తేదీ నుంచి అక్టోబరు 30వరకు ఆదాయ, వ్యయాలతో కూడిన దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. 2021-22, 2022-23, 2023-24 విద్యా సంవత్సరాలకు సంబంధించి ఆడిటర్ ధ్రువీకరించిన ఆదాయ, వ్యయాలను అందజేయాల్సి ఉంటుంది. కమిటీ నిర్ణయించే కొత్త ఫీజులు 2025-26 నుంచి 2027-28 విద్యా సంవత్సరం వరకు అమల్లో ఉంటాయి. ఉదాహరణకు వచ్చే విద్యా సంవత్సరం (2025 - 26)లో ఒక విద్యార్థి బీటెక్ ప్రథమ సంవత్సరంలో చేరితే చివరి సంవత్సరం వరకు తొలి ఏడాది చెల్లించిన ఫీజులే అమల్లో ఉంటాయి.
మరింత సమాచారం... మీ కోసం!
‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!
‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?
‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!
‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Share chat, Google News Subscribe our Youtube Channel.