* ఒక్క క్లిక్తో టెట్ రిజల్ట్
* అర్హులకు ఉచితంగా డీఎస్సీ దరఖాస్తుకు అవకాశం
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (TG TET 2024) ఫలితాలు విడుదలయ్యాయి. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేతులమీదుగా రిజల్ట్స్ వెల్లడయ్యాయి. మే 20 నుంచి జూన్ 2 వరకు జరిగిన ఈ పరీక్ష ప్రాథమిక కీని ఇటీవల విడుదల చేసిన విద్యాశాఖ అధికారులు.. ఫలితాలను సిద్ధం చేశారు. టెట్ పేపర్-1కు 85,996 మంది, పేపర్-2కు 1,50,491మంది హాజరయ్యారు. ఈ ఫలితాల్లో కొత్తగా ఉత్తీర్ణులైన వారికి డీఎస్సీ రాసే అవకాశం కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం విశేషం. పేపర్-1లో 57,725 మంది అభ్యర్థులు, పేపర్-2లో 51,443 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. పేపర్-1లో అర్హత సాధించిన వారు 67.13%. పేపర్-2లో అర్హత సాధించిన వారు 34.18%. 2023తో పోలిస్తే పేపర్-1లో 30.24% అర్హత శాతం పెరిగింది. 20023తో పోలిస్తే పేపర్-2లో 18.88% అర్హత శాతం పెరిగింది. టెట్-2024లో అర్హత సాధించని అభ్యర్థులకు వచ్చే టెట్కు ఉచితంగా దరఖాస్తు చేసుకునే వెలుసుబాటును ప్రభుత్వం కల్పించింది. టెట్-2024లో అర్హత సాధించిన వారికి ఒకసారి ఉచితంగా డీఎస్సీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. ఫలితాలను https://results.eenadupratibha.net/ వెబ్సైట్లో చూడవచ్చు.
తెలంగాణ టెట్ ఫలితాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.