* జూన్ 6 నుంచి 13 వరకు రెండో విడత రిజిస్ట్రేషన్లు
ఈనాడు ప్రతిభ డెస్క్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ డిగ్రీ కళాశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్- తెలంగాణ(దోస్త్) మొదటి విడత సీట్ల కేటాయింపు ఫలితాలు విడుదలయ్యాయి. ప్రవేశాల ప్రక్రియ మూడు విడతలుగా జరగనుంది. జులై 8న తరగతులు మొదలవుతాయి. రాష్ట్రంలోని వెయ్యికి పైగా డిగ్రీ కళాశాలల్లో ఈ ఏడాది దాదాపు నాలుగున్నర లక్షల సీట్లు అందుబాటులో ఉన్నాయి. రాష్ట్రంలోని ఆరు సంప్రదాయ విశ్వవిద్యాలయాలు, మహిళా విశ్వవిద్యాలయంలో బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీబీఎం, బీసీఏ తదితర కోర్సుల్లోని సీట్లను దోస్త్ ద్వారా భర్తీ చేయనున్నారు.
దోస్త్ ఫేజ్-1 సీట్ల కేటాయింపు ఫలితాల కోసం క్లిక్ చేయండి
దోస్త్ కాలపట్టిక...
మొదటి విడత |
రిజిస్ట్రేషన్: మే 6 నుంచి జూన్ 1 వరకు(రూ.200 రుసుం) |
వెబ్ ఆప్షన్లు: మే 20 నుంచి జూన్ 2 వరకు |
వెబ్ ఆప్షన్లు: మే 20 నుంచి జూన్ 2 వరకు |
సీట్ల కేటాయింపు: జూన్ 6న |
సీట్లు పొందినవారి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 7 నుంచి 12 వరకు. |
రెండో విడత |
రిజిస్ట్రేషన్: జూన్ 6 నుంచి 13 వరకు(రూ.400 రుసుం) |
వెబ్ ఆప్షన్లు: జూన్ 6 నుంచి 14 వరకు |
సీట్ల కేటాయింపు: జూన్ 18న |
సీట్లు పొందినవారి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 19 నుంచి 24 వరకు |
మూడో విడత |
రిజిస్ట్రేషన్: జూన్ 19 నుంచి 25 వరకు(రూ.400 రుసుం) |
వెబ్ ఆప్షన్లు: జూన్ 19 నుంచి 26 వరకు |
సీట్ల కేటాయింపు: జూన్ 29న |
సీట్లు పొందినవారి ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్: జూన్ 29 నుంచి జులై 3 వరకు |
కళాశాలల్లో స్వయంగా రిపోర్టింగ్(3 విడతల్లో సీట్లు పొంది ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేసినవారికి): జూన్ 29 నుంచి జులై 5 వరకు. |
ఓరియంటేషన్ కార్యక్రమం: జులై 1 నుంచి 6 వరకు. |
తరగతుల ప్రారంభం: జులై 8న |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.