ఈనాడు, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు ఆలస్య రుసుం లేకుండా ఫీజు చెల్లించే గడువును ఫిబ్రవరి 22వ తేదీ వరకూ పొడిగించినట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి జలీల్ తెలిపారు. ముందుగా ప్రకటించిన కాలపట్టిక ప్రకారం ఆ గడువు ఫిబ్రవరి 11తో ముగిసింది. రూ.100 ఆలస్య రుసుంతో ఫిబ్రవరి 23 నుంచి మార్చి 1 వరకు, రూ.500తో మార్చి 2 నుంచి 8 వరకు, రూ.వెయ్యితో మార్చి 9 నుంచి 15 వరకు, రూ.2 వేల ఆలస్య రుసుముతో మార్చి 16 నుంచి 22వ తేదీ వరకూ పరీక్ష ఫీజు చెల్లించవచ్చు. ట్యూషన్ ఫీజు చెల్లిస్తేనే పరీక్ష రుసుం తీసుకుంటామని ఏ కళాశాల యాజమాన్యం అభ్యంతరం చెప్పరాదని, అందుకు భిన్నంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని జలీల్ ఒక ప్రకటనలో హెచ్చరించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.