ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎన్ఐటీల్లో బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ మెయిన్ పేపర్-2లో ఒకే ఒక్క తెలంగాణ విద్యార్థి జోస్యుల వెంకట ఆదిత్య 100 పర్సంటైల్ సాధించాడు. బీ ప్లానింగ్లో మహారాష్ట్రకు చెందిన జాదవ్ ఆదిత్య సునీల్ ఆ ఘనతను దక్కించుకున్నాడు. పలు విభాగాల్లో తెలుగు రాష్ట్రాల విద్యార్థులు ఉత్తమ స్కోర్ సాధించారు. ఫిబ్రవరి 23న పేపర్-2 ఆన్లైన్ పరీక్షలు జరగగా... బీఆర్క్ పేపర్కు మొత్తం 48,836 మంది, బీప్లానింగ్ పేపర్కు 19,352 మంది హాజరయ్యారు. పరీక్షలో సాధించిన స్కోర్ను జాతీయ పరీక్షల మండలి(ఎన్టీఏ) మార్చి 18న వెల్లడించింది.
‣ బీఆర్క్లో ఏపీ టాపర్గా 99.9918093 పర్సంటైల్తో ఉప్పల వివేక్ నారాయణ్ నిలిచాడు.
‣ బీ ప్లానింగ్లో ఏపీ టాపర్గా 99.9896652 పర్సంటైల్తో బండారు రామ సాహిత్య, తెలంగాణ టాపర్గా శ్రీతేజరెడ్డి.పి(99.9844977) నిలిచారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.