• facebook
  • whatsapp
  • telegram

Students: సన్నద్ధత ‘పది’లమేనా?

న్యూస్‌టుడే, నూజివీడు పట్టణం: కొవిడ్‌ ప్రభావంతో విద్యా ప్రణాళిక అస్తవ్యస్తమైంది. గత రెండేళ్లలో కొన్ని రోజులు ప్రత్యక్ష తరగతులు, మరికొన్ని రోజులు ఆన్‌లైన్‌ బోధన ఇలా విద్యార్థులు పాఠ్యాంశాలు నేర్చుకోవడానికి తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలు కూడా నిర్వహిస్తారా లేదా అన్న సందేహాల నడుమ విద్యాశాఖ మంత్రి కొన్ని రోజుల కిందట పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేశారు. అందుకు తగ్గ పరిస్థితులు క్షేత్రస్థాయిలో కనిపించట్లేదు.  

పూర్తికాని పాఠ్యాంశాలు..  

ఏటా ఫిబ్రవరి నాటికి పదో తరగతి సిలబస్‌ను పూర్తిచేసి పునశ్చరణ తరగతుల ప్రారంభించేవారు. కానీ కరోనా, ఉద్యోగులు ఆందోళనలతో జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక పాఠశాలల్లో 70శాతం పాఠాలను కూడా బోధించలేదు. మే 2 నుంచి 13వ తేదీ వరకు పరీక్షలు నిర్వహించనున్న తరుణంలో సెలవులు పోను ఇప్పటి నుంచి కేవలం 70 రోజులే మిగిలి ఉన్నాయి. 

వంద రోజుల ప్రణాళిక ఏదీ? 

జనవరిలోనే పదో విద్యార్థులకు వంద రోజుల ప్రణాళిక అమలు చేయాల్సి ఉండగా.. ఇంత వరకు ఒక్క పాఠశాలలో కూడా ప్రారంభం కాలేదు. గతంలో ప్రతి పాఠశాలలో 100 రోజుల ప్రణాళిక అమలు చేసేవారు. మరోవైపు లాక్‌డౌన్‌ ప్రభావంతో 2019లో 8వ తరగతి విద్యార్థులకు సరిగా తరగతులు నిర్వహించలేదు. దీంతోపాటు ప్రతిభా పరీక్షలు రాయకుండానే 9వ తరగతి కూడా అలాగే పూర్తిచేసి 2021-22 విద్యా సంవత్సరంలోకి నేరుగా పదిలోకి అడుగుపెట్టారు. జనవరిలో సమ్మేటివ్‌ ఎస్సెస్‌మెంట్‌-1 పరీక్ష రాయగా.. వీరిలో 70 శాతం వరకు విద్యార్థులకు వందకు 40 నుంచి 45 మార్కులు వచ్చాయి. ఇలాంటి వారి కోసం ప్రత్యేక కార్యాచరణ ప్రారంభించాల్సి ఉంది. 

ఈ నెల చివరికి సిలబస్‌ పూర్తయితేనే.. 

పాఠాలు సెప్టెంబర్‌ నుంచి మొదలు కావడంతో విద్యా సంవత్సరం క్యాలెండర్‌ ప్రకారం పూర్తి కావాల్సిన పాఠ్యాంశాలు 55 శాతం మాత్రమే పూర్తయినట్లు విద్యార్థులు చెబుతున్నారు.  మార్చినెలలో పునశ్చరణ తరగతులు నిర్వహిస్తే ప్రభుత్వం చెబుతున్న నూరుశాతం ఉత్తీర్ణత సాధ్యపడుతుంది. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపై ప్రత్యేక దృష్టి సారించామని డీఈవో తాహేరా సుల్తానా  ‘న్యూస్‌టుడే’తో అన్నారు.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ ఈసీఎల్‌-పశ్చిమబంగాలో 313 ఖాళీలు

‣ సాధించాల‌నే త‌ప‌న‌తోనే స‌గం విజ‌యం

‣ విదేశీ భాషలు.. విశేష అవకాశాలు!  

‣ తరిగిపోతున్న దట్టమైన అడవులు

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chat and Google News

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 14-02-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.