‣ విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్
ఈనాడు, అమరావతి: ప్రభుత్వం పాఠశాలలను కాకుండా తరగతులనే విలీనం చేస్తోందని విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. ‘జాతీయ విద్యా విధానం-2020ను అనుసరించి వివిధ రకాల ఫౌండేషన్ పాఠశాలలను ఏర్పాటు చేస్తున్నాం. ఈ క్రమంలో తరగతుల విలీనమే జరుగుతుంది. 2024-25 నాటికి రాష్ట్రంలోని ప్రతి విద్యార్థి సీబీఎస్ఈ విధానంలో ఆంగ్ల మాధ్యమంలో చదువుతారు’ అని తెలిపారు. ఈ ప్రశ్న వేసిన తెదేపా సభ్యులు సభలోనే ఉన్నా.. ఆందోళన చేస్తున్నందున చర్చలో పాల్గొనలేదు.
‣ Read Latest job news, Career news, Education news and Telugu news
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.