ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలో సీబీఎస్ఈ సిలబస్ బోధించనున్న 16 ఏకలవ్య ఆదర్శ గురుకుల పాఠశాలల్లో ఉపాధ్యాయ, ఉపాధ్యాయేతర పోస్టులను పొరుగుసేవల విధానంలో త్వరలో భర్తీ చేయనున్నారు. ఇందుకు సంబంధించి తెలంగాణ గిరిజన గురుకులాల సొసైటీ ప్రకటన జారీ చేసింది. ఈ పాఠశాలల్లో హిందీ, తెలుగు, ఇంగ్లిష్, గణితం, సైన్స్, సోషల్, ఆర్ట్స్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్లు, లైబ్రేరియన్లు, టెక్నికల్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నియామకాలు చేపట్టనుంది. ఈ నెల 10 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. మరిన్ని వివరాలకు www.tgtwgurukulam.telangana.gov.in వెబ్సైట్ను సందర్శించాలని సూచించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.