ఈనాడు, కరెన్సీనగర్ : నగరంలోని ఆంధ్రా లయోల కళాశాల వెబ్ ఆధారిత కేంద్రంలో అక్టోబరు 14న పాలిటెక్నిక్ కౌన్సెలింగ్ ప్రారంభమైంది. మొదటి రోజు ఒకటో ర్యాంకు నుంచి 9000 ర్యాంకుల అభ్యర్థులను పిలవగా 43 మంది తమ ధ్రువపత్రాలను పరిశీలన చేయించుకున్నారు. అక్టోబరు 15న క్రీడా కేటగిరీ విభాగంలో ఒకటో ర్యాంకు నుంచి ఆఖరి ర్యాంకుల అభ్యర్థులు వస్తారని ప్రిన్సిపల్ వి.ఎస్.చలపతిరావు తెలిపారు.
ఐటీఐ కళాశాలల్లో 221 సీట్లు భర్తీ
గత మూడు రోజులుగా విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో మొత్తం 221 సీట్లు భర్తీ అయ్యాయి. అక్టోబరు 14న 243 నుంచి 343 ర్యాంకుల అభ్యర్థులను పిలవగా, 71 మంది హాజరయ్యారని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపల్, జిల్లా కన్వీనర్ జి.రాజ కోటేశ్వరరావు తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.