ఎన్జీవోస్కాలనీ, (వరంగల్) న్యూస్టుడే: ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాలకు రెండు తెలుగు రాష్ట్రాలలో నిర్వహించిన టీఎస్ ఐసెట్ ఫలితాలను నవంబరు 2న కాకతీయ విశ్వవిద్యాలయం కామర్స్ కళాశాలలో విడుదల చేయనున్నట్లు ఐసెట్ కన్వీనర్ ఆచార్య కె.రాజిరెడ్డి తెలిపారు. సెప్టెంబరు 30, అక్టోబరు 1 తేదీలలో జరిగిన పరీక్షలకు మొత్తం 45,975 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్య మండలి ఛైర్మన్ ఆచార్య టి.పాపిరెడ్డి విడుదల చేస్తారని చెప్పారు. కేయూ ఇన్ఛార్జి ఉపకులపతి డాక్టర్ బి.జనార్దన్రెడ్డి, రిజిస్ట్రార్ ఆచార్య కె.పురుషోత్తం పాల్గొంటారని తెలిపారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.