ఎచ్చెర్ల, న్యూస్టుడే: ఎచ్చెర్ల అంబేడ్కర్ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళంలోని బొల్లినేని మెడిస్కిల్స్ సంస్థ సంయుక్తంగా నిర్వహిస్తున్న హెల్త్కేర్ కోర్సుల్లో ప్రవేశాలకు వర్సిటీలో నవంబరు 20వ తేదీన కౌన్సెలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు వర్సిటీ డీవోఏ సంచాలకులు డా. గుంట తులసీరావు తెలిపారు. ఆయన మాట్లాడుతూ రెండేళ్ల కాల వ్యవధితో మాస్టర్ ఆఫ్ హెల్త్ అడ్మినిస్ట్రేషన్, ఏడాది కాల వ్యవదితో పీజీ డిప్లొమా ఇన్ మెడికల్ రికార్డ్సు అండ్ హెల్త్ ఇన్ఫర్మేషన్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన డిగ్రీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు కౌన్సెలింగ్ ప్రక్రియకు హాజరుకావచ్చన్నారు. రాగోలులోని జెమ్స్ యాజమాన్యంలో ఉన్న బొల్లినేని మెడిస్కిల్స్ సంస్థ ఆధ్వర్యంలో జెమ్స్ ఆసుపత్రిలో తరగతులు, ప్రయోగాలు జరుగుతాయని తెలిపారు. పూర్తి వివరాల కోసం 79950 13422, 73373 30138 ఫోన్ నంబర్లను సంప్రదించినా లేదా వర్సిటీ వెబ్సైట్లోనైనా చూసుకోవచ్చని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.