ఈనాడు, దిల్లీ: ప్రభుత్వ వైద్య వ్యవస్థ ద్వారా కొవిడ్ రోగులకు సేవలందిస్తూ ప్రాణాలు కోల్పోయిన వారి పిల్లలకు ఈ విద్యా సంవత్సరంలో ఎంబీబీఎస్ ప్రవేశాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించనున్నారు. సెంట్రల్ పూల్లో 5 సీట్లను వారికి కేటాయించాలని కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ శాఖ మంత్రి హర్షవర్ధన్ నవంబరు 19న వెల్లడించారు. ఇందుకోసం కొత్తగా ‘వార్డ్స్ ఆఫ్ కొవిడ్ వారియర్స్’ అనే కేటగిరీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.