ఈనాడు, హైదరాబాద్: ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆర్థిక సహకారంతో నడిచే పలు విద్యాసంస్థల్లో వేలాది సీట్లు మిగిలిపోయాయి. దేశవ్యాప్తంగా 31 ఎన్ఐటీలు, 26 ట్రిపుల్ ఐటీలు, 30 ఇతర సంస్థల్లో సుమారు 35 వేల సీట్లుండగా 6 విడతల జోసా కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత 7,445 సీట్లు(21 శాతం) మిగిలిపోయాయి. ఆ సీట్ల భర్తీ కోసం సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు(సీశాబ్) ఆధ్వర్యంలో రెండు విడతల ప్రత్యేక కౌన్సెలింగ్ చేపట్టారు. నవంబరు 20న మొదటి విడత, 25న రెండో విడత సీట్లను కేటాయిస్తారు. వరంగల్ ఎన్ఐటీలోనూ సీట్లు మిగిలిపోయాయి.
2 నుంచి పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలు
రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో ప్రవేశానికి పీజీ ఉమ్మడి ప్రవేశ పరీక్షలను(సీపీజీఈటీ-2020) డిసెంబరు 2 నుంచి 11వరకు నిర్వహించనున్నట్లు సీపీజీఈటీ కన్వీనర్ కిషన్ తెలిపారు. అభ్యర్థులు నవంబరు 26 నుంచి హాల్టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.