* ఎంబీబీఎస్ ప్రవేశాలపై హైకోర్టు తీర్పు
ఈనాడు, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ ప్రవేశాల్లో తమను స్థానిక అభ్యర్థులుగా పరిగణించాలని కోరుతూ పలువురు దాఖలు చేసిన వ్యాజ్యాల్ని హైకోర్టు కొట్టేసింది. స్థానిక అభ్యర్థులుగా పరిగణించే విషయంలో రాష్ట్రపతి ఉత్తర్వులు స్పష్టంగా ఉన్నాయని పేర్కొంది. స్థానిక ప్రాంతంలో వరుసగా నాలుగేళ్లు చదివి ఇంటర్ లేదా +2తో ఆ నాలుగేళ్లు ముగించాలని రాష్ట్రపతి ఉత్తర్వుల్లోని 3.4.1 నిబంధన స్పష్టం చేస్తోందని తెలిపింది. అర్హత పరీక్ష అయిన ఇంటర్ లేదా +2 తరగతులను పిటిషనర్లు ఇతర రాష్ట్రాల్లో చదివినందున వారిని స్థానికులుగా పరిగణించలేమని వెల్లడించింది.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.