గుంటూరు(జిల్లాపరిషత్), న్యూస్టుడే: ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 2020-21 విద్యా సంవత్సరానికిగాను పోస్టు గ్రాడ్యుయేషన్ కోర్సుల్లో మిగిలిపోయిన సీట్లను భర్తీ చేసేందుకు డిసెంబరు 31న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనుందని వర్సిటీ రిజిస్ట్రార్ టి.గిరిధరకృష్ణ ఓ ప్రకటనలో తెలిపారు. లాంలోని ఏపీజీసీ ఆడిటోరియంలో నిర్వహించనున్న కౌన్సెలింగ్కు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నేరుగా హాజరవ్వాలని కోరారు. వివరాలకు www.angrau.ac.in ని సందర్శించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.