ఈనాడు, హైదరాబాద్: ఎమ్మెస్సీ నర్సింగ్, మాస్టర్ ఇన్ ఫిజియోథెరపీ(ఎంపీటీ) కోర్సుల్లో సీట్ల భర్తీకి కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం 26న ప్రవేశ ప్రకటన విడుదల చేసింది. ఆన్లైన్లో దరఖాస్తుల ప్రక్రియకు జనవరి 27 సాయంత్రం 5 గంటలతో గడువు ముగియనుంది. జనవరి 28న ఉస్మానియా విశ్వవిద్యాలయంలోని ఆచార్య రామిరెడ్డి దూరవిద్య కేంద్రంలో అభ్యర్థుల ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. మరిన్ని వివరాలకు అధికారిక వెబ్సైట్ను సంప్రదించాలని వర్సిటీ వర్గాలు తెలిపాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.