రెడ్హిల్స్, న్యూస్టుడే: పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2020-21 విద్యాసంవత్సరానికి గాను రెగ్యులర్ కోర్సుల్లో ప్రవేశం పొందేందుకు దరఖాస్తుల స్వీకరణ గడువును నవంబరు 26వ తేదీ వరకు పొడిగించినట్లు వర్సిటీ రిజిస్ట్రార్ ఆచార్య భట్టు రమేశ్ తెలిపారు. తొలుత నవంబరు 19 వరకు గడువు ఇవ్వగా.. కొవిడ్ దృష్ట్యా పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. రూ.100 ఆలస్య రుసుంతో డిసెంబరు 5 వరకు దరఖాస్తులు సమర్పించవచ్చన్నారు. ఆసక్తిగలవారు బీఎఫ్ఏ(శిల్పం), చిత్రలేఖనం, ప్రింట్ మేకింగ్, ఎంఏ అనువర్తిత భాషాశాస్త్రం, ఎంఏ కమ్యూనికేషన్ జర్నలిజం, ఏంఏ జ్యోతిషం, ఎంఏ కర్ణాటక సంగీతం, ఎంపీఏ కూచిపూడి, ఎంపీఏ రంగస్థల కళలు, ఎంపీఏ జానపద కళలు, ఎంఏ తెలుగు, ఎంఏ చరిత్ర, పురావస్తు శాస్త్రం, వివిధ పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పూర్తి వివరాలకు www.pstucet.org వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.