* జనవరి 4 నుంచి 11 వరకు ప్రవేశాల ప్రక్రియ
ఈనాడు, అమరావతి: ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు రాజీవ్గాంధీ విజ్ఞాన, సాంకేతిక విశ్వవిద్యాలయం షెడ్యూల్ విడుదల చేసింది. జనవరి 4 నుంచి 11వ తేదీ వరకు ఇడుపులపాయ, ఒంగోలు, నూజివీడు, శ్రీకాకుళం ట్రిపుల్ఐటీల్లో ప్రవేశాలకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. జనరల్ మెరిట్, రిజర్వేషన్ కేటగిరీల వారీగా ర్యాంకులను విడుదల చేశారు. పూర్తి వివరాలను వెబ్సైట్లో ఉంచారు. నూజివీడు, ఇడుపులపాయ ప్రాంగణాల్లో కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఏ ప్రాంగణంలోనైనా కౌన్సెలింగ్కు హాజరుకావచ్చు. ఈసారి పదోతరగతి పరీక్షల మార్కులు లేనందున వ్యవసాయ, ఉద్యాన, వెటర్నరీ డిప్లొమా కోర్సులతో కలిపి ఉమ్మడి ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ర్యాంకులు వచ్చిన అభ్యర్థుల్లో కొందరు వ్యవసాయ డిప్లొమా కోర్సులకు వెళ్లే అవకాశం ఉన్నందున 100 సీట్లకు 150మంది చొప్పున కౌన్సెలింగ్కు అవకాశం కల్పించారు.
కౌన్సెలింగ్ ఇలా..
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.