ఈనాడు - హైదరాబాద్: పదో తరగతి వార్షిక పరీక్షల్ని మే 20 నుంచి నిర్వహించేందుకు పాఠశాల విద్యాశాఖ ప్రణాళిక సిద్ధం చేసినట్లు తెలిసింది. ఇంటర్మీడియట్ ప్రధాన సబ్జెక్టుల పరీక్షలు మే 19వ తేదీకి పూర్తవుతాయి. ఈ క్రమంలో పదో తరగతి పరీక్షలను మే 20 నుంచి ప్రారంభించి 29వ తేదీతో పూర్తి చేయాలని భావిస్తున్నారు.
మేలో అధిక ఎండల కారణంగా విద్యార్థులకు సమస్య అవుతుందని ప్రభుత్వం భావిస్తే జూన్మొదటి వారంలో ప్రారంభించేందుకు అవకాశం ఉందని ఓ అధికారి తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 5.50 లక్షల మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.
‣ ఇప్పటివరకు 6 సబ్జెక్టులకు 11 పరీక్షలు నిర్వహిస్తుండగా.. ఈసారి సబ్జెక్టుకు ఒక పరీక్ష చొప్పున ఆరు పరీక్షలే ఉంటాయని సమాచారం. అంతర్గత పరీక్షలు(ఎఫ్ఏ) నాలుగుకు బదులు రెండు ఉంటాయని చెబుతున్నారు. దీనిపై ప్రభుత్వం జీఓ జారీ చేయాల్సి ఉంటుంది.
‣ 70 శాతం సిలబస్నుంచే ప్రశ్నపత్రాలను రూపొందించేందుకు ప్రభుత్వ పరీక్షల విభాగం(ఎస్ఎస్సీ బోర్డు), రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి(ఎస్సీఈఆర్టీ) కసరత్తు చేస్తున్నాయి. సబ్జెక్టు నిపుణులను ఆహ్వానించి చర్చిస్తున్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.