Post your question

 

    Asked By: సురేష్‌

    Ans:

    బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ లాంటి ప్రొఫెషనల్‌ కోర్సులను రెగ్యులర్‌గానే చదవాలి. ఒకవేళ రెగ్యులర్‌గా చదవడం కుదరకపోతే ఆన్‌లైన్‌లో చదివే ప్రయత్నం చేయండి. డిస్టెన్స్‌ మోడ్‌లో సర్టిఫికెట్‌/డిప్లొమా కోర్సుకు బదులు, ఎంబీఏ చేసే ప్రయత్నం చేయండి. సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సుల నాణ్యత- వాటిని అందించే సంస్థల విశ్వసనీయతపై ఆధారపడి ఉంటుంది. ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థలు అందించే సర్టిఫికెట్‌లకు మార్కెట్లో ఎక్కువ గుర్తింపు ఉంటుంది. జనరల్‌ బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌లో కంటే, ఏదైనా స్పెషలైజేషన్‌ లో సర్టిఫికెట్‌/డిప్లొమా కోర్సు చేస్తే ఎక్కువ ఉపయోగకరం.
    మీరు సేల్స్‌ విభాగంలో పనిచేస్తున్నారు కాబట్టి, సేల్స్‌ మేనేజ్‌మెంట్, మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, డిజిటల్‌ మార్కెటింగ్, అడ్వర్ట్టైజింగ్, కస్టమర్‌ రిలేషన్‌షిప్‌ మేనేజ్‌మెంట్, సోషల్‌ మీడియా మార్కెటింగ్, సప్లై చైన్‌ మేనేజ్‌మెంట్, బ్రాండింగ్, కస్టమర్‌ ఎక్స్‌పీరియన్స్‌ ్స మేనేజ్‌మెంట్, రీటెయిలింగ్, ఈ-కామర్స్, సర్వీసెస్‌ మార్కెటింగ్‌ లాంటి కోర్సులు చేసినట్లయితే మెరుగైన ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగ అనుభవం, ఉద్యోగ మెలకువలతో పాటు మెరుగైన విద్యాసంస్థ నుంచి పొందే సర్టిఫికెట్‌ సహాయంతో, మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు. -
    ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: బ్రహ్మయ్య

    Ans:

    - వెటర్నరీ సైన్స్‌లో డిగ్రీ పూర్తయ్యాక ఇదే విభాగంలో పీజీ చేయవచ్చు. ఇందుకోసం ఐసీఏఆర్‌ నిర్వహించే ఏఐఈఈఏ పీజీ ప్రవేశ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాలి. పీజీలో.. వెటర్నరీ అనాటమీ, గైనకాలజీ, మెడిసిన్, పారాసైటాలజీ, ఫార్మకాలజీ అండ్‌ టాక్సికాలజీ, పెథాలజీ, వైల్డ్‌ లైఫ్‌ సైన్స్‌/ వైల్డ్‌లైఫ్‌ హెల్త్‌ మేనేజ్‌మెంట్, వైరాలజీ, మైక్రో బయాలజీ అండ్‌ ఇమ్యునాలజీ/బ్యాక్టీరియాలజీ, సర్జరీ అండ్‌ రేడియాలజీ, పబ్లిక్‌ హెల్త్‌ అండ్‌ ఎపిడిమయాలజీ, యానిమల్‌ హజ్బెండ్రీ/ డైరీ సైన్స్, యానిమల్‌ జెనెటిక్స్‌ అండ్‌ బ్రీడింగ్, యానిమల్‌ న్యూట్రిషన్, యానిమల్‌ ఫిజియాలజీ, లైవ్‌ స్టాక్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, లైవ్‌ స్టాక్‌ ప్రొడక్ట్స్‌ టెక్నాలజీ, పౌల్ట్రీ సైన్స్, వెటర్నరీ అండ్‌ యానిమల్‌ హస్బెండ్రీ ఎక్స్‌టెన్షన్, లైవ్‌స్టాక్‌/ వెటర్నరీ / యానిమల్‌ హజ్బెండ్రీ ఎకనామిక్స్,... తదితర స్పెషలైజేషన్లు ఉన్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల్లో వెటర్నరీ ఆఫీసర్లుగా, ప్రభుత్వ, ప్రైవేటు డెయిరీలు, పౌల్ట్రీఫామ్‌లు, షీప్‌ అండ్‌ రాబిట్స్‌ ఫామ్‌లు, రేస్‌ క్లబ్బులు, జువలాజికల్‌ పార్కులు, వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, బయోటెక్‌ కంపెనీలు, బోధన కళాశాలలు, యానిమల్‌ బ్రీడింగ్‌ కేంద్రాలు, ప్రైవేటు వెటర్నరీ క్లినిక్‌లు, పరిశోధన సంస్థలు, స్వచ్ఛంద సేవా సంస్థలు, యానిమల్‌ ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, వెటర్నరీ ఫార్మా కంపెనీలు, యానిమల్‌ న్యూట్రిషన్‌ సంస్థల్లో ఉద్యోగాలు ఉంటాయి.  

    Asked By: ఎస్. వినితాగౌడ్

    Ans:

    బీఎస్సీ (ఎంబీజడ్‌సీ)లో మీరు చదువుతున్న మైక్రో బయాలజీ, జువాలజీ, కెమిస్ట్రీ... మూడు సబ్జెక్టుల్లో ఎంఎస్సీ చదవొచ్చు. ఇవేకాకుండా ప్లాంట్‌ బయాలజీ, బయోకెమిస్ట్రీ, యానిమల్‌ బయాలజీ, బయోటెక్నాలజీల్లో కూడా పీజీ చదివే అవకాశం ఉంది. పరిశోధనా రంగంపై ఆసక్తి ఉంటే లైఫ్‌సైన్స్‌ సబ్జెక్టుల్లో ఐదు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్‌ ఎంఎస్సీ పీహెచ్‌డీ, బోధనా రంగంపై ఆసక్తి ఉంటే బీఈడీ చేయొచ్చు. ఇక ఉద్యోగావకాశాల విషయానికొస్తే.. బయోటెక్‌ కంపెనీల్లో, ఫార్మా కంపెనీల్లో, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సంస్థల్లో, బయో మెడికల్‌ కంపెనీల్లో, ఆగ్రో బేస్డ్‌ పరిశ్రమల్లో, బెవరేజ్‌ ఇండస్ట్రీలో, పర్యావరణ పరిశోధన సంస్థల్లో, మెడికల్‌ డయాగ్నస్టిక్‌ కేంద్రాల్లో, యూనివర్సిటీ/ కళాశాల ప్రయోగశాలల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. బీఎస్సీ విద్యార్హతతో పొందే ఉద్యోగాలకు వేతనాలు ఆకర్షణీయంగా ఉండవు. ఏదైనా సబ్జెక్టులో పీజీ చేసిన తర్వాత ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎన్‌.ఆర్‌. చంద్రశేఖర్‌

    Ans:

    అగ్రికల్చర్‌ బీఎస్సీ చేసినవారికి ఎంఎస్సీలో అగ్రికల్చర్, హార్టికల్చర్‌ చదివే అవకాశం ఉంటుంది. ఎంఎస్సీ అగ్రికల్చర్‌లో ప్లాంట్‌ జెనెటిక్స్, ప్లాంట్‌ సైన్స్, బయోటెక్నాలజీ, మాలిక్యులర్‌ బయాలజీ, ప్లాంట్‌ ఫిజియాలజీ, ప్లాంట్‌ బ్రిడింగ్, ప్లాంట్‌ పెతాలజీ, అగ్రికల్చర్‌ మైక్రోబయాలజీ, సీడ్‌సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ, ఎంటమాలజీ, నెమటాలజీ, ఆగ్రానమీ... లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఎంఎస్సీ హార్టికల్చర్‌లో వెజిటబుల్‌ క్రాప్స్, ఫ్రూట్‌సైన్స్, పోస్ట్‌ హార్వెస్ట్‌ టెక్నాలజీ ఫర్‌ హార్టికల్చర్‌ క్రాప్స్, ఫ్లోరికల్చర్‌ అండ్‌ ల్యాండ్‌ స్కేపింగ్‌ ఆర్కిటెక్చర్, ప్లాంటేషన్‌ సైన్సెస్, మెడిసినల్‌ అండ్‌ ఆరోమెటిక్‌ క్రాప్స్‌.. లాంటి స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంఎస్సీ అగ్రికల్చర్‌/ హార్టికల్చర్‌ చదవాలంటే, ఐసీఏఆర్‌ నిర్వహించే ఏఐఈఈఏ పీజీ ప్రవేశ పరీక్షలో మెరుగైన ర్యాంకు సాధించాలి. ఒకవేళ మేనేజ్‌మెంట్‌ వైపు వెళ్లాలనుకుంటే అగ్రిబిజినెస్‌లో ఎంబీఏ చేసే అవకాశం కూడా ఉంది. ఎంబీఏ చేయడానికి ఐఐఎంలు నిర్వహించే క్యాట్‌ పరీక్షలో మంచి స్కోర్‌ సంపాదించాలి. అగ్రికల్చర్‌ బీఎస్సీ చదివినవారికి ప్రభుత్వ, ప్రయివేటు రంగాల్లో చాలా ఉపాధి అవకాశాలు ఉన్నాయి. ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ లాంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ నిర్వహించే నియామక పరీక్షలు రాయవలసి ఉంటుంది. వ్యవసాయ విశ్వవిద్యాలయాల్లో, వ్యవసాయ కళాశాలల్లో, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాలల్లో, వ్యవసాయ పరిశోధనా కేంద్రాల్లో, ఐసీఏఆర్‌ అనుబంధ పరిశోధనా సంస్థల్లో, ఫుడ్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా సంస్థలో, విత్తన తయారీ కేంద్రాల్లో, ఫుడ్‌ టెక్నాలజీ కంపెనీల్లో, ఎరువుల తయారీ కంపెనీల్లో, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ యూనిట్లు, బ్యాంకుల్లో కూడా ఉద్యోగావకాశాలు ఉంటాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: సందీప్‌రెడ్డి

    Ans:

    ఎంబీఏలో మార్కెటింగ్‌ చదివినవారికి డిమాండ్‌ ఎప్పుడూ ఉంటుంది. దశాబ్దకాలంగా పెరిగిన దేశీయ, బహుళజాతి వ్యాపార సంస్థల విస్తరణ, సోషల్‌ మీడియా వినియోగం, ఆన్‌లైన్‌ రిటెయిల్‌ రంగంలో వస్తున్న విప్లవాత్మక మార్పులు, డిజిటల్‌ మార్కెటింగ్‌ లాంటి అంశాల వల్ల మార్కెటింగ్‌ విభాగంలో ఉపాధి అవకాశాలు ఎక్కువయ్యాయి. ఎంబీఏ మార్కెటింగ్‌ చదివినవారికి సేల్స్‌ మేనేజ్‌మెంట్‌, బ్రాండ్‌ మేనేజ్‌మెంట్‌, ప్రొడక్ట్‌ మేనేజ్‌మెంట్‌, డిజిటల్‌ మార్కెటింగ్‌, అడ్వర్టయిజింగ్‌ లాంటి విభాగాల్లో కొలువులు లభిస్తాయి. మీరు డిగ్రీలో చదివిన ఫిజిక్స్‌, కెమిస్ట్రీలకు సంబంధించిన ఎలక్ట్రికల్‌, ఎలక్ట్రానిక్స్‌, కమ్యూనికేషన్‌, సాఫ్ట్‌వేర్‌, ఫార్మా సంబంధిత రంగాల్లో ఉద్యోగాల కోసం ప్రయత్నించవచ్చు. ఎఫ్‌ఎంసీజీ, బ్యాంకింగ్‌, రిటెయిలింగ్‌, ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌, మీడియా, హెల్త్‌కేర్‌, రియల్‌ ఎస్టేట్‌, టూరిజం, స్పోర్ట్స్‌ రంగాల్లో కూడా మార్కెటింగ్‌ చదివినవారికి ఉద్యోగావకాశాలు అధికం.

    ఇటీవలి కాలంలో విస్తరిస్తున్న స్టార్టప్‌ సంస్థల్లోనూ మార్కెటింగ్‌ నిపుణుల అవసరం చాలా ఉంది. ఎంబీఏ మార్కెటింగ్‌ చదివినవారికి మొదట్లో సేల్స్‌ ఎగ్జిక్యూటివ్‌, మార్కెటింగ్‌ ఎగ్జిక్యూటివ్‌, బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ లాంటి ఉద్యోగాలు లభిస్తాయి. కొత్తగా ఉద్యోగంలో చేరినప్పుడు వేతనాలు ఆకర్షణీయంగా లేనప్పటికీ, మీ పని తీరు, అనుభవాన్ని పట్టి భవిష్యత్తులో మెరుగైన వేతనాలు లభిస్తాయి. మీకు ప్రభుత్వ ఉద్యోగాలపై ఆసక్తి ఉంటే పబ్లిక్‌ సెక్టార్‌ బ్యాంకుల్లో, ప్రభుత్వరంగ సంస్థల్లో మార్కెటింగ్‌ ఉద్యోగాల కోసం ప్రయత్నించండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్‌, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: డి. అశోక్‌

    Ans:

    మీరు బీఏలో మూడో సబ్జెక్ట్‌గా చదువుతున్న ఆర్థికశాస్త్రంతో  ప్రత్యేకించి ఉద్యోగాలు ఉండవు. కానీ డిగ్రీ అర్హత ఉన్న అన్ని ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాలకూ మీరు అర్హులే. ఎకనామిక్స్‌లో నాలుగు సంవత్సరాల బీఏ ఆనర్స్‌ కానీ, రెండు సంవత్సరాల పీజీ కానీ చదివితే ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువుంటాయి. బీఏ తరువాత మంచి యూనివర్సిటీలో ఎంఏ ఎకనామిక్స్‌ చదివితే మెరుగైన ఉపాధి అవకాశాలు లభిస్తాయి. ఎంఏ ఎకనామిక్స్‌ చదివినవారు యూపీఎస్‌సీ నిర్వహించే ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వీస్‌ పరీక్షకు అర్హులు. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా, నాబార్డ్, ఇండియన్‌ ఎకనామిక్‌ సర్వే లాంటి సంస్థల్లో పోటీ పరీక్షల ద్వారా ఉద్యోగం పొందవచ్చు. పీజీలో ఎకనామిక్స్‌ చదివితే బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌ రంగాల్లో, స్వచ్ఛంద సంస్థల్లో, పరిశోధన, బిజినెస్‌ అనలిటిక్స్, బోధన, వ్యాపార పత్రికారంగాల్లో ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎంఏ ఎకనామిక్స్‌ చదివినవారు ఎకనమిస్ట్‌గా, మార్కెట్‌ రీసెర్చ్‌ అనలిస్ట్‌గా, క్రెడిట్‌ అనలిస్ట్‌గా, రిస్క్‌ అనలిస్ట్‌గా, ఫైనాన్సియల్‌ అనలిస్ట్‌గా, ఎకనమిక్‌ కంటెంట్‌ రైటర్‌గా పనిచేయవచ్చు. డేటా సైన్స్, ఆక్చూరియల్‌ సైన్స్, ఇన్సూరెన్స్‌ల్లో సర్టిఫికెట్‌/ డిప్లొమా కోర్సులు చేయడం వల్ల ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. వీటితో పాటు ఎంఎస్‌ ఎక్సెల్, ఎస్‌పీఎస్‌ఎస్, జమోవి, బ్లూస్కై స్టాటిస్టిక్స్, ఈ వ్యూస్, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్‌ లాంటి సాఫ్ట్‌వేర్‌లపై పట్టు సాధిస్తే మెరుగైన భవిష్యత్తు ఉంటుంది. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. దిలీప్‌సాయి

    Ans:

    మీరు ఇంజినీరింగ్‌ చివరి సంవత్సరంలో ఉన్నారు కాబట్టి, ఇప్పటినుంచే ఎంఎస్‌ కోర్సు చదవడానికి కావాల్సిన ఏర్పాట్లు మొదలుపెట్టండి. కెనడాలో ఎంఎస్‌ చేయాలంటే జీఆర్‌ఈ స్కోర్‌ తోపాటు, టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ స్కోర్‌ అవసరం. వీటిల్లో మంచి స్కోర్‌ సంపాదిస్తే ప్రముఖ యూనివర్సిటీల్లో ప్రవేశంతోపాటు, స్కాలర్‌షిప్‌ కూడా లభించే అవకాశం ఉంది.
    కొన్ని యూనివర్సిటీలు టోఫెల్‌/ ఐఈఎల్‌టీఎస్‌ల్లో వచ్చిన స్కోర్‌తోనూ ప్రవేశాలు కల్పిస్తున్నాయి. కెనడాతో పోలిస్తే జర్మనీలో ట్యూషన్‌ ఫీజు నామమాత్రం. జర్మనీలో చాలా యూనివర్సిటీలు ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌ స్కోర్‌ ఆధారంగానే అడ్మిషన్‌లు ఇస్తున్నాయి. కొన్ని జర్మన్‌ యూనివర్సిటీలు మాత్రం  ఐఈఎల్‌టీఎస్‌/ టోఫెల్‌తో పాటు జీఆర్‌ఈ స్కోర్‌ కూడా పరిగణనలోకి తీసుకొంటున్నాయి.
    ముందుగా ఏ దేశంలో, ఏయే యూనివర్సిటీలో ఎంఎస్‌ని ఏ స్పెషలైజేషన్‌తో చదవాలనుకొంటున్నారో నిర్ణయించుకోండి. యూనివర్సిటీల వెబ్‌సైట్‌లకు వెళ్ళి ఫీజు వివరాలను, ఆ నగరంలో వసతికయ్యే ఖర్చుల వివరాలను తెలుసుకొని, అవసరమైన ఆర్థిక వనరుల గురించి కూడా ఆలోచించండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. అరుణ్‌కుమార్‌

    Ans:

    ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్‌ గ్రూపు చదివినవారు డిగ్రీలో సైన్స్‌ చదివే అవకాశం లేదు కానీ, సైన్స్‌ గ్రూప్‌ చదివినవారు, డిగ్రీలో ఆర్ట్స్‌లో చేరొచ్చు. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక ఈ అవకాశం ఉండొచ్చు. కాకపోతే చదవబోయే సైన్స్‌ కోర్సుకు సంబంధించిన కొన్ని ముందస్తు సబ్జెక్టులు చదివివుండాలనే నిబంధన పెట్టే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మాత్రం ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్‌ గ్రూపు చదివినవారికి బీఎస్‌సీ ఇంటీరియర్‌ డిజైన్, బీఎస్‌సీ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, బి. డిజైన్‌ లాంటి కోర్సులు అందిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: జి. అరుణ్‌కుమార్‌

    Ans:

    ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్‌ గ్రూపు చదివినవారు డిగ్రీలో సైన్స్‌ చదివే అవకాశం లేదు కానీ, సైన్స్‌ గ్రూప్‌ చదివినవారు, డిగ్రీలో ఆర్ట్స్‌లో చేరొచ్చు. జాతీయ విద్యావిధానం- 2020 పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చాక ఈ అవకాశం ఉండొచ్చు. కాకపోతే చదవబోయే సైన్స్‌ కోర్సుకు సంబంధించిన కొన్ని ముందస్తు సబ్జెక్టులు చదివివుండాలనే నిబంధన పెట్టే అవకాశం ఉంది. కొన్ని ప్రైవేటు విశ్వవిద్యాలయాలు మాత్రం ఇంటర్మీడియట్‌లో ఆర్ట్స్‌ గ్రూపు చదివినవారికి బీఎస్‌సీ ఇంటీరియర్‌ డిజైన్, బీఎస్‌సీ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, బి. డిజైన్‌ లాంటి కోర్సులు అందిస్తున్నాయి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: ఎన్‌. హరిప్రసాద్‌

    Ans:

    పదో తరగతి చదివాక ప్రభుత్వ రెసిడెన్షియల్‌ జూనియర్‌ కాలేజీల్లో ఎంట్రన్స్‌ పరీక్ష రాసి ప్రవేశం పొందినట్లయితే, ఇంటర్మీడియట్‌ ఉచితంగా, వసతిగృహంలో ఉండి చదివే అవకాశం ఉంది. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ, మైనారిటీలకు ప్రత్యేకంగా వసతిగృహాలతో కూడిన జూనియర్‌ కళాశాలలు అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో కూడా ఇంటర్‌ని ఉచితంగా చదవొచ్చు. హాస్టల్‌తో సంబంధం లేకుండా ఇంటర్‌ను ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో నామమాత్రపు ఫీజుతో చదువుకోవచ్చు. పద్దెనిమిది సంవత్సరాలు నిండాక ఉద్యోగం కావాలనుకుంటే వొకేషనల్‌ కోర్సులతో ఇంటర్‌ చదవొచ్చు. ఉపాధి త్వరగా లభించే అవకాశాలుంటాయి. ఇంటర్మీడియట్‌ చదివేవారికి వారి సామాజిక, ఆర్థిక నేపథ్యాలను బట్టి ప్రభుత్వ స్టైపెండ్‌ వచ్చే అవకాశం ఉంది. పద్దెనిమిది ఏళ్లకే ఉద్యోగం కావాలనుకొంటే, పదో తరగతి పూర్తయ్యాక పాలిటెక్నిక్‌ కోర్సు చదవొచ్చు. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌