* అభ్యంతరాల నమోదుకు అవకాశం
* మొత్తం 1,896 ఉద్యోగాల భర్తీ
ఈనాడు ప్రతిభ డెస్క్: ఆంధ్రప్రదేశ్లో పశుసంవర్ధక సహాయకుల పోస్టుల నియామక పరీక్ష ప్రాథమిక కీని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ విడుదల చేసింది. కీపై అభ్యంతరాలను ఆన్లైన్లో జనవరి 3వ తేదీలోగా తెలియజేయవచ్చు. త్వరలో ఫలితాలతో పాటు తుది కీ వెల్లడి కానుంది. ఈ పరీక్ష డిసెంబర్ 31న జరిగిన విషయం తెలిసిందే. పశుసంవర్ధక సబార్డినేట్ సర్వీసులో రెగ్యులర్ ప్రాతిపదికన 1,896 పశుసంవర్ధక సహాయక(ఏహెచ్ఏ) ఖాళీలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పశుసంవర్ధక శాఖ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. ఎంపికైన అభ్యర్థులు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. కంప్యూటర్ ఆధారిత పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, గోపాలమిత్ర/ గోపాలమిత్ర సూపర్వైజర్గా పనిచేసిన అభ్యర్థులకు వెయిటేజీ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నెలకు రూ.22,460- రూ.72,810 వేతనం ఉంటుంది.
ఏహెచ్ఏ రాత పరీక్ష ప్రశ్నపత్రం, ప్రాథమిక కీ
అభ్యంతరాల నమోదుకు క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.