కాకినాడ (గాంధీనగర్), న్యూస్టుడే: సార్వత్రిక ఎన్నికల తేదీలు ప్రకటించిన నేపథ్యంలో జేఎన్టీయూకే నిర్వహించనున్న ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఏపీఈఏపీసెట్)-2024 తేదీలపై సందిగ్ధం నెలకొంది. ఇటీవలే దీనికి నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 13 నుంచి 19 వరకు ఆన్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ పరీక్షలు ప్రారభమయ్యే తొలిరోజు మే 13న రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీనిపై సెట్ ఛైర్మన్, జేఎన్టీయూకే ఉపకులపతి జీవీఆర్ ప్రసాదరాజును ‘న్యూస్టుడే’ సంప్రదించగా దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.