ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 352 కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయా (కేజీబీవీ)ల్లో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశాల దరఖాస్తు స్వీకరణకు ఏప్రిల్ 20 వరకు గడువు పెంచుతున్నట్లు సమగ్రశిక్షా రాష్ట్ర పథక సంచాలకుడు (ఎస్పీడీ) శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటి వరకు 11వ తరగతిలో ప్రవేశాలకు 29,621 దరఖాస్తులు, ఆరో తరగతికి 45,621 దరఖాస్తులు వచ్చినట్లు ఏప్రిల్ 10న ఓ ప్రకటనలో వెల్లడించారు. దరఖాస్తులను ఆన్లైన్ ద్వారానే స్వీకరిస్తున్నాం. ఆసక్తి గల విద్యార్థులు https://apkgbv.apcfss.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. మరిన్ని వివరాలకు 18004258599 నంబరును సంప్రందించాలి అని సూచించారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.