ఈనాడు, హైదరాబాద్: దేశవ్యాప్తంగా గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్టు ఇన్ ఇంజినీరింగ్(గేట్)-2024 ఆన్లైన్ పరీక్షలు శనివారం (ఫిబ్రవరి 3) ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 3, 4, 10, 11 తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. ఐఐటీలు, ఎన్ఐటీలు, ఇతర ప్రతిష్ఠాత్మక విద్యాసంస్థల్లో ఎంటెక్ కోర్సులో ప్రవేశానికి మొత్తం 30 సబ్జెక్టుల్లో ఈ పరీక్షను నిర్వహిస్తారు. ఈసారి బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్(ఐఐఎస్సీ) నిర్వహణ బాధ్యతలు తీసుకుంది. బీటెక్తోపాటు బీఎస్సీ, బీఏ, బీకాం విద్యార్థులు కూడా ఈ పరీక్ష రాస్తారు. ఈసారి 8 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్ష మంది రాస్తారని అంచనా. ఇందుకోసం తెలంగాణలో 11, ఏపీలో 17 చోట్ల కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షలో సాధించిన స్కోర్కు మూడేళ్లపాటు విలువ ఉంటుంది. గేట్ ర్యాంకర్లను కేంద్ర ప్రభుత్వ రంగసంస్థలు(పీఎస్యూ) ముఖాముఖికి ఆహ్వానించి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.