* ఇప్పటి వరకు 51,924 సీట్లకు.. 1.10 లక్షల దరఖాస్తులు
ఈనాడు, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ, సాధారణ గురుకులాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి అయిదో తరగతిలో ప్రవేశాలకు ఉమ్మడి ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువు జనవరి 23 వరకు పొడిగిస్తూ ఎస్సీ గురుకుల సొసైటీ నిర్ణయం తీసుకుంది. ఆయా 643 గురుకులాల్లో మొత్తం 51,924 సీట్ల కోసం ఇప్పటి వరకు 1.10 లక్షల మంది దరఖాస్తు చేశారు. అభ్యర్థుల నుంచి వస్తున్న విజ్ఞప్తుల మేరకు జనవరి 20తో ముగియాల్సిన గడువు మరో 3 రోజులు పొడిగించినట్లు గురుకుల సొసైటీ కార్యదర్శి, గురుకుల సెట్ కన్వీనర్ నవీన్ నికోలస్ తెలిపారు. ఫిబ్రవరి 11న ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రవేశ పరీక్ష జరుగుతుందన్నారు.
బాలికలు, బాలుర గురుకులాలు, సీట్లు
సొసైటీ | బాలికలు | బాలురు | సీట్లు |
సాంఘిక | 141 | 91 | 18560 |
గిరిజన | 46 | 36 | 6560 |
బీసీ | 146 | 148 | 23680 |
సాధారణ | 20 | 15 | 3124 |
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.