• facebook
  • whatsapp
  • telegram

Inter Exams: 4 నుంచి ఇంటర్‌ ప్రశ్నపత్రాల మూల్యాంకనం

ఈనాడు, అమరావతి: ఏపీలో శనివారం (మార్చి 2) జరిగిన ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం రెండో భాష పరీక్షలకు 97% మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 4,16,918 మంది విద్యార్థులకు గాను 4,05,925 మంది పరీక్షలు రాశారు. నాలుగు మాల్‌ప్రాక్టీస్‌ కేసులు నమోదయ్యాయి. ఇంటర్‌ ప్రశ్నపత్రాల మూల్యాంకనం మార్చి 4 నుంచి మొదలుకానుంది. మొత్తం నాలుగు విడతలుగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్‌ విద్యామండలి ప్రణాళిక రూపొందించింది. 4న సంస్కృతం పేపర్‌-1, 2లను 16 నుంచి ఆంగ్లం, తెలుగు, హిందీ, గణితం, రాజనీతి శాస్త్రం పేపర్లు, 20 నుంచి భౌతికశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, 22 నుంచి రసాయనశాస్త్రం, కామర్స్‌ పేపర్లు 24 నుంచి చరిత్ర, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం పేపర్ల మూల్యాంకనం  నిర్వహిస్తారు.  

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 03-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.