ఈనాడు, అమరావతి: ఏపీలో శనివారం (మార్చి 2) జరిగిన ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం రెండో భాష పరీక్షలకు 97% మంది హాజరయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా 4,16,918 మంది విద్యార్థులకు గాను 4,05,925 మంది పరీక్షలు రాశారు. నాలుగు మాల్ప్రాక్టీస్ కేసులు నమోదయ్యాయి. ఇంటర్ ప్రశ్నపత్రాల మూల్యాంకనం మార్చి 4 నుంచి మొదలుకానుంది. మొత్తం నాలుగు విడతలుగా నిర్వహించేందుకు ఇంటర్మీడియట్ విద్యామండలి ప్రణాళిక రూపొందించింది. 4న సంస్కృతం పేపర్-1, 2లను 16 నుంచి ఆంగ్లం, తెలుగు, హిందీ, గణితం, రాజనీతి శాస్త్రం పేపర్లు, 20 నుంచి భౌతికశాస్త్రం, ఆర్థిక శాస్త్రం, 22 నుంచి రసాయనశాస్త్రం, కామర్స్ పేపర్లు 24 నుంచి చరిత్ర, వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం పేపర్ల మూల్యాంకనం నిర్వహిస్తారు.
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.