* చివరి తేదీ ఎప్పుడంటే?
* ఏప్రిల్ 4- 15 తేదీల్లో పరీక్షలు
ఈనాడు ప్రతిభ డెస్క్: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్2024 దరఖాస్తు గడువు తేదీ పొడిగించినట్లు ఎన్టీఏ వెల్లడించింది. అర్హులైన అభ్యర్థులు మార్చి 4వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. మార్చి 6, 7 తేదీల్లో దరఖాస్తు సవరణలకు అవకాశం ఉంటుంది. చివరి విడతను ఏప్రిల్ 4 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జాతీయ పరీక్షల సంస్థ(NTA) ప్రకటించింది. మార్చి మూడో వారంలో పరీక్ష కేంద్రాల వివరాలను ప్రకటిస్తారు. ఏప్రిల్ 25న ఫలితాలు వెల్లడి కానున్నాయి. తొలి విడత పరీక్షలు జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఎన్టీఏ నిర్వహించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా ఎన్ఐటీలు, ట్రిపుల్ఐటీల్లో బీటెక్ సీట్లను జేఈఈ మెయిన్ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈఈ అడ్వాన్స్డ్ రాయాలి. మెయిన్లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్డ్ పరీక్ష రాసేందుకు అవకాశముంటుంది.
ఎన్టీఏ అధికారిక ప్రకటన వివరాలు
జేఈఈ మెయిన్ 2024 నోటిఫికేషన్ వివరాల కోసం క్లిక్ చేయండి
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.