* తగిన జాగ్రత్తలు పాటిస్తే మేలు
ఈనాడు ప్రతిభ డెస్క్: దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్ తుది విడత పరీక్ష నిర్వహణకు ఎన్టీఏ ఏర్పాట్లు చేస్తోంది. ప్రధాన కేంద్రాల్లో ఏప్రిల్ 4, 5, 6, 8, 9, 12 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. పరీక్ష కేంద్రం వివరాలు ఇప్పటికే విడుదల కాగా అడ్మిట్ కార్డులు త్వరలో అందుబాటులో రానున్నాయి. ఈ నేపథ్యంలో పరీక్ష రాసే అభ్యర్థులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది.
* పరీక్ష కేంద్రానికి వెళ్లేటప్పుడు అభ్యర్థులు ఎన్టీఏ వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న అడ్మిట్ కార్డును కచ్చితంగా తీసుకెళ్లాలి. అడ్మిట్ కార్డు లేకపోతే పరీక్ష కేంద్రంలోకి అనుమతించరు.
* అభ్యర్థులు తమ ధ్రువీకరణను సూచించే ఫొటోతో ఉన్న గుర్తింపు కార్డులను తీసుకెళ్లాలి. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్పోర్టు, ఆధార్ కార్డు, రేషన్కార్డు లేదా 12వ తరగతి అడ్మిట్ కార్డు, బ్యాంకు పాసుపుస్తకంలో ఏదైనా ఒక కార్డును తీసుకెళ్లాలి.
* అటెండెన్స్ షీట్పై ఫొటోను అతికించాల్సి ఉంటుంది కాబట్టి సెంటర్కు పాస్పోర్టు సైజ్ ఫొటోను తీసుకెళ్లాలి.
* ట్రాన్స్పరెంట్గా ఉండే బాల్పాయింట్ పెన్ తీసుకెళ్తే మంచిది.
* దివ్యాంగ అభ్యర్థులైతే, వైద్యాధికారి ధ్రువీకరించిన సర్టిఫికెట్ను తీసుకెళ్లాలి.
* అడ్మిట్ కార్డులో ఇచ్చిన సూచనల్ని తప్పకుండా చదవాలి.
* పరీక్ష సమయానికి రెండు గంటలు ముందుగానే చేరుకొనేలా ప్రణాళిక చేసుకోండి.
* పరీక్షకు సంబంధించి ఇబ్బంది ఎదురైతే కేంద్రం సూపరింటెండెంట్ లేదా ఇన్విజిలేటర్ను సంప్రదించవచ్చు.
* పరీక్ష కేంద్రంలో ఇచ్చే రఫ్ షీట్లపైనే కాలిక్యులేషన్సు, రైటింగ్ వర్కు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత రఫ్ షీట్లను ఇన్విజిలేటర్కు అందజేయాలి.
జేఈఈ మెయిన్ 2024 సెషన్-2
సిటీ ఇంటిమేషన్ స్లిప్పుల కోసం క్లిక్ చేయండి
జేఈఈ మెయిన్ స్టడీమెటీరియల్
జేఈఈ మోడల్ పేపర్లు 2024
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.