• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 19-03-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1. హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌లో పంకజ్‌

భారత దిగ్గజ క్యూ ఆటగాడు పంకజ్‌ అడ్వాణీకి అరుదైన గౌరవం దక్కింది. చైనాలోని షాంగ్రావో నగరంలో ఉన్న ప్రపంచ బిలియర్డ్స్‌ హాల్‌ ఆఫ్‌ ఫేమ్‌ మ్యూజియంలో పంకజ్‌ చోటు దక్కించుకున్నాడు. 

 పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


2. కర్బన ఉద్గారాలతో తరుముకొస్తున్న ముప్పు!

2023లో ప్రపంచవ్యాప్తంగా కర్బన ఉద్గారాల విడుదల అధికమైందని, భూమి, నీరు ఉపరితలాల్లో ఉష్ణోగ్రతలు ఎగబాకుతూ హిమానీనదాలు, సముద్రాల్లోని మంచు ఫలకలు వేగంగా కరిగిపోతున్నాయని ‘ప్రపంచ వాతావరణ స్థితి’ పేరుతో విడుదల చేసిన నివేదికలో యూఎన్‌ వాతావరణ శాఖ తెలిపింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...



3.   తెలంగాణ నూతన గవర్నర్‌గా సీపీ రాధాకృష్ణ

తెలంగాణ గవర్నర్, పుదుచ్చేరి ఇన్‌ఛార్జి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ పదవులకు తమిళిసై సౌందరరాజన్‌ చేసిన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించారు. ఆ రెండు బాధ్యతలను ఝార్ఖండ్‌ గవర్నర్‌ సీపీ రాధాకృష్ణన్‌కు అదనంగా అప్పగించారు. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

4.   బానిసల శ్రమతో అపార లాభాలు!

ప్రపంచవ్యాప్తంగా వెట్టిచాకిరీ ద్వారా లభించే అక్రమ లాభాలు 2021కల్లా ఏడాదికి 23,600 కోట్ల డాలర్లకు చేరాయని అంతర్జాతీయ కార్మిక సంస్థ (ఐఎల్‌వో)  వెల్లడించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

5.  శరద్‌పవార్‌ వర్గానికే ‘ఎన్సీపీ-శరద్‌చంద్ర పవార్‌’ పేరు

మరాఠ్వాడా దిగ్గజ నేత శరద్‌పవార్‌ నేతృత్వంలోని ఎన్సీపీ వర్గం పార్టీ పేరు, ఎన్నికల గుర్తు విషయంలో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం వెలువరించింది. వారి రాజకీయ పక్షం పేరు ‘ఎన్సీపీ-శరద్‌చంద్ర పవార్‌’, ఎన్నికల గుర్తు ‘బాకా’ను కొనసాగించాలని ఎన్నికల సంఘాన్ని(ఈసీ) ఆదేశించింది. 

పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...


 

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...


 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 20-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.