1. లోక్సభ ఎన్నికల షెడ్యూల్ విడుదల
దేశంలో జరిగే లోక్సభ ఎన్నికలకు షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదల చేసింది. కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు విస్తరించిన 543 లోక్సభ స్థానాలతోపాటు ఆంధ్రప్రదేశ్, అరుణాచల్ప్రదేశ్, ఒడిశా, సిక్కిం అసెంబ్లీలకు, వివిధ కారణాల వల్ల ఖాళీ అయిన 13 రాష్ట్రాల్లోని 26 అసెంబ్లీ స్థానాలకు 7 దశల్లో ఎన్నికలు జరగనున్నాయి.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
2. శ్రీవల్లి జోడీకి టైటిల్
ఐటీఎఫ్ మహిళల టెన్నిస్ టూర్ టోర్నీలో శ్రీవల్లి రష్మిక డబుల్స్ ఫైనల్లో శ్రీవల్లి-వైదేహి చౌదరి జంట 6-3, 7-5తో సుయాన్ లీ-సొయున్ పార్క్ (కొరియా) ద్వయాన్ని ఓడించింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
3. మోదీ-తోబ్గే సమావేశ నివేదిక
భారత్-భూటాన్ మధ్య ఉన్న సౌర, పవన విద్యుత్తు, గ్రీన్ హైడ్రోజన్ రంగాల్లో భాగస్వామ్యాన్ని పెంపొందించుకునేందుకు ఇరుదేశాల ప్రధానమంత్రులు అంగీకరించారని మోదీ-తోబ్గే సమావేశం జరిగిన రెండు రోజుల వెలువడిన ఉమ్మడి ప్రకటన తెలిపింది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
4. ప్రసార భారతి ఛైర్మన్గా నవనీత్ కుమార్
ప్రసార భారతి ఛైర్మన్గా విశ్రాంత ఐఏఎస్ అధికారి నవనీత్ కుమార్ సెహగల్ నియమితులయ్యారు. ఛైర్మన్గా ఉన్న సూర్యప్రకాశ్ పదవి కాలం 2020లో ముగియడంతో అప్పటినుంచి ఈ పోస్టు ఖాళీగా ఉంది.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
5. కేసులు వేగంగా పరిష్కరించేందుకు కోర్టుల సంఖ్య పెంపు
న్యాయస్థానాల్లో పెద్ద సంఖ్యలో కేసులు అపరిష్కృతంగా ఉంటున్నాయని.. అందుకే న్యాయస్థానాల సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచుతున్నామని, ఈ క్రమంలో కేసులను వేగంగా పరిష్కరించేందుకు కృషి చేయాలని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే న్యాయమూర్తులు, న్యాయవాదులకు సూచించారు.
పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి...
మరిన్ని లేటెస్ట్ కరెంట్ అఫైర్స్ కోసం క్లిక్ చేయండి...
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.