• facebook
  • whatsapp
  • telegram

Latest Current Affairs: 23-03-2024 కరెంట్‌ అఫైర్స్‌ (తెలుగు)

1.  రాష్ట్రపతిపై రిట్‌ పిటిషన్‌ 
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముపై కేరళ ప్రభుత్వం రిట్‌ పిటిషన్‌ దాఖలు చేసింది. శాసనసభ ఆమోదించిన 4 బిల్లులను ముర్ము ఆమోదించకుండా నిలుపుదల చేయడాన్ని అందులో సవాల్‌ చేసింది. అధికరణ 32 ప్రకారం వేసిన ఈ పిటిషన్‌లో రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మహమ్మద్‌ ఖాన్‌ చర్యలనూ తప్పుపట్టింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

2.    భారత్‌ సాయంతో భూటాన్‌లో ఆసుపత్రి
భూటాన్‌లో మహిళలు, పిల్లల కోసం ఆసుపత్రి నిర్మించేందుకు భారత్‌ సాయమందించింది. రాజధాని థింపూలో 150 బెడ్ల సదుపాయంతో దీనిని నిర్మించారు. ఈ ఆసుపత్రిని భారత్, భూటాన్‌ ప్రధానులు నరేంద్ర మోదీ, షెరింగ్‌ తోబ్గేలు ప్రారంభించారు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 

3.  సునీల్‌ ఛెత్రి జీ 150వ అంతర్జాతీయ మ్యాచ్‌
దాదాపు రెండు దశాబ్దాల కింద అరంగేట్రం చేసిన భారత ఫుట్‌బాల్‌ స్టార్‌ సునీల్‌ ఛెత్రి మరో మైలురాయిని అందుకోనున్నాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగే ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌ ఛెత్రికి కెరీర్‌లో 150వ అంతర్జాతీయ మ్యాచ్‌. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో 150 లేదా అంతకన్నా ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన 40వ ఫుట్‌బాలర్‌గా అతడు నిలవనున్నాడు. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...
 


4.   అరవై శాతం మంది పిల్లలకు డిజిటల్‌ వ్యసనం ముప్పు
అరవై శాతం మంది పిల్లలు డిజిటల్‌ వ్యసనం బారిన పడే ప్రమాదం ఉందని తాజా సర్వే ఒకటి పేర్కొంది. ఇందులో 5 నుంచి 16 ఏళ్ల మధ్యనున్న వారే ఉన్నారని తెలిపింది. ఈ ప్రతికూల ప్రభావాన్ని తగ్గించడానికి తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరముందని సూచించింది. 
పూర్తి వివ‌రాల కోసం క్లిక్ చేయండి...

మరిన్ని లేటెస్ట్‌ కరెంట్‌ అఫైర్స్‌ కోసం క్లిక్‌ చేయండి...
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 24-03-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.